కారుబాంబు దాడిలో 11 మంది మృతి | Sakshi
Sakshi News home page

కారుబాంబు దాడిలో 11 మంది మృతి

Published Tue, Jun 7 2016 7:55 PM

కారుబాంబు దాడిలో 11 మంది మృతి - Sakshi

ఇస్తాంబుల్: టర్కీలోని ఇస్తాంబుల్లో మంగళవారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీసులను లక్ష్యంగా చేసుకొని కారుబాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు అధికారులతో పాటు, నలుగురు పౌరులు మృతి చెందగా 35 మంది గాయపడ్డారు. ఆందోళన కారులను అదుపుచేసే రయట్ కంట్రోల్ పోలీసు బృందం బస్సులో వెళ్తుండగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు.

పట్టణంలో పర్యటకులతో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుళ్లు జరిగిన ప్రాంతంలో రోడ్డు పక్కన గల భవంతులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇస్తాంబుల్ గవర్నర్ వాసిప్ సహిన్ తెలిపారు. దాడులకు పాల్పడిన ఉగ్రవాద సంస్థ వివరాలు తెలియలేదు.

Advertisement
Advertisement