జెనీవా: ఈ ఏడాది భూగోళం మరింతగా మండిపోతున్నది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్నది. వాతావరణ మార్పులపై పారిస్ లో మరో వారంలో కీలక సదస్సు జరుగనున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. 2015 సంవత్సరం అత్యంత వేడిమి నమోదైన సంవత్సరంగా రికార్డులకెక్కనుందని తెలిపింది.
'2015 అత్యంత వేడిమి నమోదైన సంవత్సరంగా రికార్డులకెక్కే అవకాశం కనిపిస్తున్నది. ఉష్ణోగ్రతల నమోదు మొదలైన నాటినుంచి ఈ సంవత్సరమే సముద్రాల టెంపరేచర్ అత్యధిక స్థాయిలో పెరిగింది' అని ప్రపంచ వాతావరణ సంస్థ అధిపతి మిచేల్ జరూద్ తెలిపారు. ఇది మన భూగోళానికి తీవ్ర ప్రతికూల విషయమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి పదినెలల్లో భూమి, సముద్రాల్లో ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో నమోదయ్యాయని, 2014లో నమోదైన అత్యధిక స్థాయిని అవి దాటాయని ఆయన వివరించారు. 19 శతాబ్దంతో పోల్చుకుంటే ఉపరితల ఉష్ణోగ్రతల సగటు అంతర్జాతీయంగా 1.0 డిగ్రీలు పెరిగిందని ప్రాథమిక వివరాలను బట్టి తెలుస్తున్నదని, ఇది అత్యంత కీలక విషయమని తెలిపారు.
నానాటికీ ఉష్ణోగ్రతలు పెరిగిపోయి భూగోళం మండిపోతున్న నేపథ్యంలో ఇప్పటికీ మన చేతుల్లో పరిష్కారం ఉందని, వాతావరణంలోకి విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువులను నియంత్రించడమే ఇందుకు ఉన్న పరిష్కారమని ఆయన చెప్పారు.
భూగోళం మండిపోతున్నది!
Published Wed, Nov 25 2015 6:43 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement