ప్రమాదంలో 38 మంది బాలికల మృతి | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో 38 మంది బాలికల మృతి

Published Sun, Aug 30 2015 2:17 AM

38 girls, young women killed in Swaziland crash

జోహన్నెస్‌బర్గ్: స్వాజిలాండ్ దేశంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 38 మంది బాలికలు, ఒక యువతి చనిపోగా, 20 మంది గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న లారీ ఎంబబానే నుంచి మంజీనీకి వెళ్తుండగా మరో వాహనాన్ని ఢీకొట్టింది. బాలికలు, యువతులు  స్వాజిలాండ్ రాజభవనంలో జరిగే నృత్య వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ వేడుకలో రాజు యువతుల్లో ఒకరిని భార్యగా స్వీకరిస్తారు.

Advertisement
Advertisement