పారిస్ సదస్సు ప్రపంచాన్ని శాంతి, సుస్థిరత దారిలో నిలపాలి: బాన్
లె బూర్జ్: ‘‘వాతావరణ మహావిపత్తు ముంచుకొస్తోంది.. గడియలు దగ్గరపడుతున్నాయి.. దానిపై పోరాడటం కోసం అసంపూర్ణ చర్యలేవీ ఫలించవు’’ అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కి-మూన్ స్పష్టంచేశారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ శివార్లలోని లె బూర్జ్ పట్టణంలో జరుగుతున్న ఐరాస వాతావరణ సదస్సులో 195 దేశాల పర్యావరణ మంత్రులు, విధానకర్తలను ఉద్దేశించి బాన్ సోమవారం ప్రసంగించారు. ‘‘అసంపూర్ణ చర్యలు, కొంచెం కొంచెం చూద్దామన్న విధానాలకన్నా మరింత ఎక్కువ చర్యలను ప్రపంచం మీ నుంచి ఆశిస్తోంది. సమూలంగా మార్చివేయగల ఒప్పందం అడుగుతోంది. పారిస్ సదస్సు.. ప్రపంచాన్ని దీర్ఘకాలిక శాంతి, సుస్థిరత, సుసంపన్నతల మార్గంలో నిలపాలి.’’ అని ఆయన పిలుపునిచ్చారు.
8 పర్యావరణ పరిశీలన కేంద్రాలను స్థాపిస్తాం: జవదేకర్
ఇదిలావుంటే.. ఈ సదస్సులో వాతావరణ ఒప్పందం కోసం ప్రపంచ దేశాల చర్చల ప్రతినిధులు తయారు చేసిన 48 పేజీల ముసాయిదాపై సోమవారం నుంచి అన్ని దేశాల మంత్రులూ జరుపుతున్న చర్చల్లో భారత పర్యావరణ మంత్రి ప్రకాశ్జవదేకర్ కూడా పాల్గొంటున్నారు. వాతావరణ మార్పు దీర్ఘకాలికంగా చూపబోయే ప్రభావాలను అధ్యయనం చేయటానికి.. భారతదేశంలో హిమాలయాలు, పశ్చిమకనుమలు సహా ఎనిమిది విభిన్న ప్రాంతాల్లో పర్యావరణ పరిశీలన కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.
దీర్ఘకాలిక పర్యావరణ పరిశీలన కేంద్రాల కార్యక్రమాన్ని జవదేకర్ సోమవారం పారిస్ సదస్సులో ప్రారంభిస్తూ.. ‘‘ప్రపంచ జనాభాలో 17 శాతం, పశు జనాభాలో 17 శాతం మా దేశంలో ఉంది. కానీ.. ప్రపంచ భూవిస్తీర్ణంలో మాకున్నది కేవలం 2.5 శాతమే. అయినప్పటికీ.. ఇండియాలో 8 శాతం జీవవైవిధ్యం ఉంది. హిమాలయాలు, పశ్చిమ కనుమలు, మధ్య భారత్ నుంచి సుందరవనాలు, జమ్మూకశ్మీర్ నుంచి రాజస్థాన్, గుజరాత్ల వరకూ పరిశీలన కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. మాకు పది సముద్ర తీర రాష్ట్రాలు ఉన్నాయి. పది హిమాలయ రాష్ట్రాలున్నాయి. పది అటవీ ప్రధాన రాష్ట్రాలున్నాయి. 1,300 దీవులున్నాయి’’ అని వివరించారు.
Breadcrumb
Related news
-
పచ్చటి కళ.. నేచర్ డ్యాన్స్
‘ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది’ అనే మాటలో గ్యారెంటీ ఉందో లేదో తెలియదుగానీ చాలా చిన్నవయసులోనే సంగీత, నాట్యాలపై అభిమానాన్ని పెంచుకుంది సోహిని రాయ్ చౌదురి. నాన్న మంచి సంగీతకారుడు. ఇక నానమ్మ బొకుల్సేన్ గుప్త సంగీతంలో దిట్ట. కోల్కతాలోని ప్రసిద్ధ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ స్థాపకురాలు. రాగాల గొప్పదనం ఏమిటంటే... నేర్చుకుంటూ పోతే కొత్త లోకాలు ఆవిష్కరించబడతాయి. నృత్యాల గొప్పదనం ఏమిటంటే... చేస్తూ పోతే కొత్త ప్రపంచాలు చేరువవుతాయి. సంగీత సాహిత్య నృత్య ప్రపంచాల సంగతి సరే... భౌతిక ప్రపంచం సంగతేమిటి? పొగలు,సెగలు, కర్బన ఉద్గారాలు... భూమికి గాయాలు చేస్తున్నాయి. ‘ఈరోజు గడిస్తే చాలు’ అనుకునేవాళ్లు తప్ప రేపటి గురించి ఆలోచించేవాళ్లు అరుదైపోయారు. ఈ నేపథ్యంలోనే కళాకారుల బాధ్యత పెరుగుతుంది. నిజమైన కళాకారులు చేసే పని సృజనాత్మక ప్రపంచాన్ని, భౌతిక ప్రపంచంతో సమన్వయం చేయడం. ప్రస్తుతం అదే పని చేస్తుంది సోహిని. పర్యావరణ సంబంధిత అంశాలను నృత్యరూపకాలుగా మలిచి మన దేశంలోనే కాదు 14 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. తాజాగా కాప్ 26, గ్లాస్గోలో ‘నేచర్ అండ్ అజ్’ పేరుతో ఇచ్చిన నృత్యప్రదర్శన దేశదేశాల ప్రతినిధులను ఆకట్టుకుంది. సాంకేతిక విషయాలతోనే కాదు దేశీయ సాంస్కృతిక మూలాలతో కూడా పర్యావరణ స్పృహ కలిగించవచ్చని నిరూపించింది సోహిని. ఈ నృత్యప్రదర్శనలో ఆమె కుమారుడు రిషిదాస్ గుప్త గిటార్ ప్లే చేయడం విశేషం. ‘కాప్26 కేంద్రసిద్ధాంతాన్ని నృత్యం, సంగీతం, కథనం, వేదపాఠాల ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం చేశాను’ అంటుంది సోహినిరాయ్. ఆమె ప్రయత్నం విజయవంతమైందని చెప్పడానికి ‘నేచర్ అండ్ అజ్’కు ‘కాప్26’లో ప్రపంచ ప్రతినిధుల నుంచి లభించిన ప్రశంసలే గొప్ప నిదర్శనం. -
ఉష్ణోగ్రత తగ్గింపే లక్ష్యం
2100 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదల 2 డిగ్రీల కంటే తక్కువే ఉండాలి: పారిస్ సదస్సులో తీర్మానం పదమూడు అన్న అంకె పాశ్చాత్య దేశాల్లో అశుభ సూచకం. అయితే నవంబరు 30న పారిస్లో మొదలైన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21వ సమావేశం మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఘన విజయం సాధించింది. పదమూడు రోజల తీవ్ర చర్చోపచర్చల తరువాత... భూమిపై మనిషి మనుగడను ప్రశ్నార్థకం చేసే భూతాపోన్నతిని రెండు డిగ్రీల కంటే తక్కువ స్థాయికి పరిమి తం చేస్తామని దాదాపు 196 దేశాలు అంగీకరించడం మానవ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం గా పేర్కొనడం ఏమాత్రం అతిశయోక్తి కాబోదు. చేతి చమురు వదులుతుందన్న భయంతో అమెరికా వంటి అగ్రరాజ్యాలు కొంత బెట్టుచూపినా... కాలుష్యం మోతాదు ఆధారంగా దేశాలు తగ్గింపు విషయంలో బాధ్యతలు పంచుకోవాలన్న భారత్, చైనాలు పట్టుబట్టినా... వాతావరణం మారిపోతే అందరికంటే ముందుగా బలయ్యేది తామే కాబట్టి... మా గోడు పట్టించుకోమన్న చిన్న, ద్వీప సముదాయ దేశాలు బతిమలాడినా... చివరకు స్పష్టమైన విషయం ఒక్కటే. భూమి పదికాలాలపాటు పదిలంగా ఉండాలంటే చేయి చేయి కలపాల్సిందేనని.. అందుకే పారిస్ సదస్సు చివరి క్షణాల్లో ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు బాన్ కీ మూన్ ‘‘మనల్ని కాపాడుతున్న ఈ భూమిని రక్షించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది’’ అని స్పష్టంగా ప్రకటించారు. పారిస్: పారిస్పై ఉగ్రవాద దాడులు జరిగిన కొన్ని రో జులకే... నవంబరు 30న మొదలైన ప్యారిస్ సదస్సు నిజానికి శుక్రవారమే ముగియాల్సి ఉంది. అయితే కొన్ని కీలక అంశాల విషయంపై దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు రాత్రి పొద్దుపోయేంత వరకూ కొనసాగాయి. వాతావరణ మార్పులను తట్టుకునేందుకు పేద దేశాలకు అందించాల్సిన ఆర్థిక సాయం, కాలుష్య కారకులకు ఎక్కువ బాధ్యత తదితర అంశాలపై వ్యక్తమైన భిన్నాభిప్రాయాలను తొలగించేందుకు సమావేశాల పొడిగింపు తప్పలేదు. చివరకు శనివారం మధ్యాహ్నం సమయానికి 196 సభ్యదేశాల కరతాళ ధ్వనుల మధ్య ఫ్రాన్స్ విదేశాంగ శాఖ మంత్రి లారెంట్ ఫాబియస్ తుది ముసాయిదాను సమావేశం ముందు ఉంచారు. ఈ తుది చర్చల్లో పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే మాట్లాడుతూ ‘‘భూమి భవితను నిర్ణయించే ఒప్పందం మన ముందుంది. ఈ తొలి వాతావారణ ఒప్పందాన్ని ప్రపంచదేశాలన్నీ ఆమోదించాలి’’ అని అభ్యర్థించారు. అనంతరం ఈ ఒప్పందానికి సమావేశం ఆమోద ముద్ర వేసింది. స్వాగతించిన భారత్ పారిస్ సదస్సు తుది ముసాయిదా ఒప్పందాన్ని భారత్ బలపరిచింది. సదస్సు ప్రారంభమైన నాటి నుంచి చర్చల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవ్దేకర్ ఒప్పందం ముసాయిదాపై పొగడ్తలు కురిపించారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలకు బాధ్యతల బరువు వేర్వేరుగా ఉండాలన్న భారత్ వాదనకు ఒప్పందంలో చోటు దక్కడం ఎంతైనా హర్షణీయమైన విషయమని, ఒప్పందంలోని అన్ని అంశాల్లోనూ దీని ప్రస్తావన ఉందని తెలిపారు. భారత్కు సంబంధించినంత వరకూ ఇది కీలక విజయమని స్పష్టం చేశారు. పర్యావరణ కాలుష్యాన్ని పెంచని సుస్థిర జీవనశైలుల అంశాన్ని కూడా భారత్ ప్రపంచం ముందుకు తెచ్చిందని, 31 పేజీల తుది ఒప్పంద ముసాయిదాలో దీనికీ చోటు దక్కిందని తెలిపారు. ‘‘ఈ ఒప్పంద ప్రతిని స్థూలంగా పరిశీలిస్తే భారత్ వ్యక్తం చేసిన ఆందోళనలు అన్నింటికీ సమాధానాలు ఉన్నట్టుగానే అనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. శనివారం తుది ముసాయిదాను ప్రవేశపెట్టిన తరువాత వాటిపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు సభ్యదేశాలకు కొంత గడువు ఇచ్చారు. ఈ సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేసి ఒప్పందానికి మద్దతు పలకాల్సిందిగా అభ్యర్థించినట్లు వార్తలు వచ్చాయి. నరేంద్రమోదీ ఒప్పంద సారాంశంపై హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతరాలు తగ్గాయి వాతావరణ మార్పులకు సంబంధించి ఇప్పటివరకూ జరిగిన సదస్సులకు ప్యారిస్ సదస్సుకు ఉన్న ముఖ్యమైన తేడా అంతర్జాతీయంగా చట్టబద్ధమైన ఒప్పందం కుదరడం. ఈ కొత్త ఒప్పందంలోని ముఖ్యాంశాలు... ► 2100 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల కంటే గణనీయంగా తక్కువ ఉండేలా చూడాలి. అదే సమయంలో 1.5 డిగ్రీ సెల్సియస్ పెరుగుదలకు పరిమితం చేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేయాలి. ► వాతావరణ మార్పులకు తట్టుకునేందుకు, ఎదుర్కొనేందుకు అగ్రరాజ్యాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2020 నాటి నుంచి ఏటా పదివేల కోట్ల డాలర్ల (రూ.6.5 లక్షల కోట్లు) కనీస మొత్తం అందించాలి. 2025లో ఈ మొత్తాన్ని మరోసారి సమీక్షిస్తారు. హా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించేం దుకు జరుగుతున్న ప్రయత్నాలను ఐదేళ్లకు ఒకసారి సమీక్షించాలి. ఇవీ గత ఒప్పందాలు... భూ తాపోన్నతి, వాతావరణ మార్పుల నియంత్రణకు ప్రపంచదేశాలు చర్యలు మొదలుపెట్టింది రియో డి జెనీరోలో (1992) జరిగిన ఎర్త్ సమ్మిట్తోనే. ఈ సమావేశం ఫలితంగా 1997లో క్యోటో ప్రోటోకాల్ అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందానికి 82 దేశాలు మాత్రమే అంగీకారం తెలిపాయి. అమెరికా సహా కొన్ని పారిశ్రామిక దేశాలు ఒప్పందంపై సంతకాలు చేయలే దు. దీని ప్రకారం పా రిశ్రామిక దేశాలు త మ కర్బన ఉద్గారాల ను 1990 నాటి స్థాయి కంటే కనీసం 5 శాతం తక్కువ చేయాలి. ఈ ఒప్పందం అమల్లో కొన్ని దేశాలు విఫలమైనా మొత్తమ్మీద ఉద్గారాలు లక్ష్యం కంటే రెండు రెట్లు ఎక్కువ మోతాదులో తగ్గడం విశేషం. అయితే ఇదే సమయంలో 36 దేశాలు తగ్గించుకున్న ఉద్గారాల కంటే ఎక్కువ మోతాదులో చైనా వంటి దేశాలు ఉద్గారాలను విపరీతంగా పెంచేయడంతో మొత్తమ్మీద క్యోటో ప్రోటోకాల్ తాలూకూ ఫలితం కనిపించకుండా పోయింది. ► 2009 కోపెన్హెగెన్ సదస్సులో తొలిసారి అన్ని దేశాలు తమ తమ కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలన్న ఉమ్మడి నిర్ణయానికి వచ్చాయి. అయితే ఇందుకు సంబంధించి చట్టబద్ధమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం మాత్రం కుదరలేదు. ► 2012లో దోహాలో జరిగిన సమావేశంలో క్యోటో ప్రోటోకాల్ ఒప్పంద కాలాన్ని 2020 వరకూ పొడిగించారు. ప్యారిస్ సదస్సులో కుదిరే ఒప్పందం 2020 నుంచి 2030 వరకూ అమల్లో ఉంటుంది. ఎందుకు..? ఏమిటి..? ఎలా..? సమస్య ఏమిటి? భూమి వెచ్చబడుతోంది. గత వందేళ్ల కాలంలో భూమి సగటు ఉష్ణోగ్రత 0.85 డిగ్రీ సెల్సియస్ వరకూ పెరిగింది. 2000 సంవత్సరం మొదలుకొని ఇప్పటివరకూ దాదాపు 13 ఏళ్లు అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది కూడా దీనికి భిన్నమేమీ కాదు! ఎందుకు ఇలా... వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువులు మరీ ముఖ్యంగా కార్బన్డ యాక్సైడ్ మోతాదు పెరిగిపోవడం. పెరిగిపోతున్న పరిశ్రమలు, వ్యవసా యం కారణంగా కార్బన్డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్హౌస్ వాయువులు వాతావరణంలో ఎక్కువ గా పేరుకుపోతున్నాయి. ఫలితంగా భూమి అంతరిక్షంలోకి ప్రతిఫలించే సూర్యరశ్మి తాలూకూ వేడి వాతావరణంలో ఎక్కువ కాలంపాటు ఉండిపోతోంది. కార్బన్డయాక్సైడ్ను పీల్చుకుని నిక్షిప్తం చేసుకోగల అడవుల విస్తీర్ణం తగ్గిపోతూండటం అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతోంది. ఈ ఏడాది మే నెలకు వాతావరణంలోని కార్బన్డయాక్సైడ్ మోతాదు 400 పార్ట్స్ పర్ మిలియన్కు చేరుకుంది. గడచిన 8 లక్షల సంవత్సరాల్లో ఈ వాయువు ఇంత మోతాదులో ఉండటం ఇదే తొలిసారి. దుష్పరిణామాలు ఏమిటి? ఏటికేడాదీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో పడుతున్న ఇబ్బందులు మనకు తెలియనివి కావు. అయితే భూతాపోన్నతి దుష్పరిణామాల్లో వేసవి ఉష్ణోగ్రతల పెరుగుదల ఒక చిన్న అంశం మాత్రమే. భూతాపోన్నతి కారణంగా అకాల వర్షాలు, వరదలు (చెన్నై, ఉత్తరాఖండ్ కుంభవృష్టుల మాదిరిగా), సముద్రమట్టాల పెరుగుదల, పంట దిగుబడులు తగ్గిపోవడం, అంటువ్యాధులు ప్రబలుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 1900తో పోలిస్తే సముద్రమట్టాలు ఇప్పటికే దాదాపు 19 సెంటీమీటర్లు పెరిగినట్లు గుర్తించారు. అంతేకాకుండా ధ్రువప్రాంతాల్లోని మంచు, హిమాలయాలతోపాటు ఇతర హిమనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. మరి భవిష్యత్తులో ఎలా....? ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో పెరుగుతూ పోతే భూమిపై మనిషి మనుగడ మరింత కష్టమవుతుంది. వాతావరణ మార్పుల కారణంగా చాలా ప్రాంతాల్లో విపరీతమైన నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. తరచూ పలకరించే కరువులు, వడగాడ్పులు, ఆకస్మిక కుంభవృష్టులతో విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతాయి. నీటి కొరత, వాతావరణ మార్పుల ప్రభావంతో వరి, గోధుమ వంటి పంటల దిగుబడులు దాదాపు 30 శాతం వరకూ తగ్గవచ్చునని అంచనా. ఎవరెవరు ఎంతెంత? వాతావరణంలో కార్బన్ డైయాక్సైడ్ మోతాదు పెరిగిపోవడం భూతాపోన్నతికి కారణమని తెలుసుకున్నాం కాదా... మరి ఈ విషవాయువులు ఎవరు ఎంత మోతాదులో విడుదల చేస్తున్నారో తెలుసా? పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన దేశాలు చైనా, అమెరికాలు దాదాపు 36 శాతం ఉద్గారాలకు కారణమవుతున్నాయి. యూరోపియన్ యూనియన్ మరో 9 శాతం, భారత్, బ్రెజిల్లు మరో ఆరు శాతం చొప్పున గ్రీన్హౌస్ వాయువులను వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయి. రష్యా(5), జపాన్(3), కెనెడా (2), ఇండొనేషియా (1.5), కాంగో (1.5) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. పెరుగుదల ఎంత ఉండొచ్చు? ఈ శతాబ్దం చివరి నాటికి భూమి ఉష్ణోగ్రతలు ఎంత మేరకు పెరగవచ్చు అన్న అంశం కర్బన ఉద్గారాల తగ్గింపునకు తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటాయి. ప్రపంచ దేశాలన్నీ ఏ చర్య తీసుకోకుండా ఉద్గారాలను ఇలాగే కొనసాగిస్తే... పెరుగుదల 4.6 డిగ్రీ సెల్సియస్ వరకూ ఉండవచ్చు. ప్రభుత్వాలు ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాలను ఇలాగే కొనసాగిస్తే ఇది 3.6 డిగ్రీ సెల్సియస్కు, పారిస్ సదస్సులో తీసుకున్న విధాన నిర్ణయాలకు కట్టుబడితే 2.7 డిగ్రీ సెల్సియస్కు పరిమితమవుతుందని అంచనా. - జి. గోపాలకృష్ణ మయ్యా, సాక్షి ఒప్పందంలో..భారత అభిప్రాయాలకు చోటు పారిస్: వాతావరణ మార్పుపై కాప్-21 సదస్సు ఆమోదం తెలిపిన ఒప్పందంలో భారత్ వెల్లడించిన అభిప్రాయాలకు చోటు దక్కిందని పరిశీలకులు వెల్లడించారు. సుస్థిర జీవన, వినియోగ విధానాలు, వాతావరణ న్యాయం అంశాలను ఒప్పంద పీఠికలో పొందుపరిచారు. వాతావరణ మార్పుపై పోరాటంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల బాధ్యత ఎవరెవరిది ఎంత అనేది... అన్ని అంశాల్లోనూ తప్పక పాటించాలనే భారత్ అభిప్రాయాన్ని ఇందులో పొందుపరిచారు. వాతావరణ మార్పుకు సంబంధించి అన్ని అంశాలపై దృష్టిసారించి తయారుచేసిన ఈ ఒప్పందం.. సమతుల్యమైనదని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లారెంట్ ఫేబియస్ పారిస్లో అన్నారు. సభ్యత్వ దేశాల మధ్య మరింత విశ్వాసాన్ని పెంచేదిలా ఒప్పందం తయారుచేశామన్నారు. ఆయా దేశాల్లో అమల్లో ఉన్న వ్యవస్థలను దృష్టిలో ఉంచుకుని అత్యుత్తమమైన, సమర్థవంతమైన, పారదర్శకమైన విధివిధానాలను రూపొందించామన్నారు. కాగా, భారత్, చైనా, సౌదీ అరేబియా సహా సభ్యత్వ దేశాల్లోని 134 అభివృద్ధి చెందుతున్న దేశాలు ఒప్పందాన్ని స్వాగతించాయి. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నందుకు సంతోషంగా ఉందని డజనుకుపైగా దేశాలు ఉన్న లైక్-మైండెడ్ డెవలపిం గ్ కంట్రీస్(ఎల్ఎండీసీ) గ్రూప్ అధికార ప్రతినిధి గురుదయాళ్ సింగ్ నజార్ ప్రకటించారు. మనకు కావాల్సింది..* 650,00,00,00,00,000 వాతావరణ మార్పులను తట్టుకోవ డం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దాదాపు అన్ని రంగాల్లోనూ కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాల్సి ఉంటుంది. కొత్త టెక్నాలజీలతోపాటు మానవ వనరుల అభివృద్ధి పరిశోధనల కోసం కొత్తకొత్త సంస్థల ఏర్పాటు తదితర చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక్క భారతదేశానికి మాత్రమే ఎంత మొత్తం అవసరమవుతుందో తెలుసా? దాదాపు లక్ష కోట్ల డాలర్లు! రూపాయల్లో చెప్పాలంటే.. 65 లక్షల కోట్లు! దేశంలోనే పేరెన్నికగన్న మూడు సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ‘క్లైమెట్ ఛేంజ్ అండ్ ఇండియా అడాప్టేషన్ గ్యాప్ (2015).. ఏ ప్రిలిమినరీ అసెస్మెంట్’ పేరుతో ఐఐటీ, ఐఐఎం(గాంధీనగర్, అహ్మదాబాద్)లతోపాటు కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్లు ఈ నివేదికను సిద్ధం చేశాయి. గత 14 ఏళ్లలో దేశంలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల (వరదలు, తుపానులు, వడగాడ్పులు, చలిగాలులు, కరువు కాటకాలు) వల్ల జరిగిన నష్టం ఆధారంగా ఈ మొత్తాన్ని లెక్కించారు. ఈ కాలంలో 131 సందర్భాల్లో వరదలు, 51 తుపానులు సంభవించగా, 26 సార్లు చలిగాలులు, వడగాడ్పులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వీటన్నింటి వల్ల జరిగిన నష్టం దాదాపు రూ. 3 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా భవిష్యత్తులోనూ ఇలాంటివి మరిన్ని ఎక్కువ చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీస్థాయిలో నష్టాలు నమోదవుతాయి. అందుకే వీటిని తట్టుకునేందుకు, ఆస్తి ప్రాణ నష్టాలను తగ్గించేందుకు అనేక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. వీటన్నింటికీ అయ్యే ఖర్చును పరిగణనలోకి తీసుకుంటే అది దాదాపు 65 లక్షల కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. కార్బన్ బడ్జెట్ అంటే ఏమిటి? పారిస్ సదస్సు సందర్భంగా తరచూ ఒక మాట వినిపిస్తోంది... అది కార్బన్ బడ్జెట్. ఏమిటిది? అన్న సందేహం మీకూ వచ్చే ఉంటుంది. సమాధానం ఇదిగో... 2100 నాటికి భూమి ఉష్ణోగ్రతలను నిర్దిష్ట స్థాయికి పరిమితం చేసేందుకు ఎంత మేరకు గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేసే అవకాశం ఉందో దాన్ని కార్బన్ బడ్జెట్ అని పిలుస్తున్నారు. ఒక అంచనా ప్రకారం... పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటి నుంచి 2100 వరకూ దాదాపు లక్ష కోట్ల టన్నుల కార్బన్ డైయాక్సైడ్ను విడుదల చేసినా భూమి ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెల్సియస్కు మించి పెరగదు. అయితే ఈ లక్ష కోట్ల టన్నుల కార్బన్ బడ్జెట్లో 2011 నాటికల్లా మనం 52 శాతం వాడేశాము. అంటే ఇప్పటికే దాదాపు 52 వేల కోట్ల టన్నుల కార్బన్ డైయాక్సైడ్ వాతావరణంలోకి చేర్చేశామన్నమాట. ఫలితంగా ఉష్ణోగ్రత దాదాపు 0.85 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. మిగిలిన 85 ఏళ్లలో కేవలం 48 వేల కోట్ల టన్నులు మాత్రమే విడుదల చేసేందుకు అవకాశముంది. -
సమస్యల కొల్లేరు ఆశల సెలయేరు
నెరవేరేనా ఈ మారు రేపు కొల్లేటికోటకు కేంద్రమంత్రుల రాక కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలతో సమావేశం ఆశలన్నీ కాంటూరు కుదింపుపైనే.. కోల్లేటివాసుల జీవనప్రదాయినిగా.. అంతులేని మత్స్యసంపదకు ఆలవాలంగా.. ప్రకృతి రమణీయతకు పట్టుకొమ్మగా విలసిల్లుతున్న కొల్లేరు సిరుల సెలయేరు. ప్రశాంతతకు చిహ్నంగా.. శాంతికపోతంగా పైకి కనిపించే ఈ సరస్సు వెనుక ఏళ్ల తరబడి కన్నీరు ప్రవాహమై ఉరకలేస్తోంది. ఎన్నో సమస్యలు.. ఎంతోమంది పాలకులు.. వచ్చిపోయే వారే గానీ పరిష్కారం చూపేవారే లేక.. కొల్లేరు కన్నీటి ఏరై నెమ్మదిగా కదులుతోంది. ఆ కన్నీళ్లను తుడుస్తానంటూ.. ఆశల పల్లకీని మోసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం కోసం కొల్లేరువాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన హామీ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్తో కలిసి శుక్రవారం హెలికాప్టర్లో కొల్లేరులో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం కైకలూరు మండలం కొల్లేటికోట గ్రామంలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలతో బహిరంగ సమావేశం నిర్వహించనున్నారు. కొల్లేటి సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం కీలకం కానుంది. - కైకలూరు కొల్లేటి సమస్య ఎప్పుడూ ప్రభుత్వాలకు సవాల్గానే మారుతోంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 77వేల 131 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు అభయార ణ్యం విస్తరించి ఉంది. ఇక్కడి ఆక్రమిత చెరువుల వల్ల పర్యావరణం దెబ్బతింటోందని సుప్రీంకోర్టులో పర్యావరణవేత్తలు పిల్ వేయడంతో 2006లో ఇరు జిల్లాల్లోనూ 31వేల 125.75 ఎకరాల విస్తీర్ణంలో ఆక్రమిత చేపల చెరువులను ధ్వంసం చేశారు. అప్పటి నుంచి కొల్లేరు వాసులు కొల్లేరు కాంటూరు పరిధిని +5 నుంచి +3 వరకు కుదించాలని కోరుతున్నారు. అదేవిధంగా కృష్ణాజిల్లాలో కొల్లేరు ఆపరేషన్ సమయంలో ధ్వంసం చేసిన 7,500 ఎకరాలను పంపిణీ చేయాలని చెబుతున్నారు. ఆ ఆశలు నెరవేరేనా.. కొల్లేరు ప్రజల చిరకాల ఆశలు ఈసారైనా నెరవేరుతాయా అనే అనుమానం ఇక్కడి ప్రజల్లో నెలకొంది. ప్రతిసారీ నాయకులు రావడం.. వాగ్దానాలు చేసి వెళ్లడం పరిపాటిగా మారింది. అప్పటి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేష్ 2010 ఫిబ్రవరిలో కొల్లేటికోటలో సమావేశం నిర్వహించారు. కాంటూరు కుదింపుపై సానుకూలంగా మాట్లాడారు. అంతా బాగుంటుందనే సమయానికి 2010 మే 21న చిత్తడి నేలల చట్టం పరిధిలోకి కొల్లేరును చేరుస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ముసాయిదా విడుదల చేసింది. దేశంలోని 25 చిత్తడి ప్రాంతాల్లో కొల్లేరును చేర్చింది. అనంతరం 2010 సెప్టెంబరు 19 నుంచి 24వ తేదీ వరకు ప్రముఖ పర్యావరణవేత్త ఆజీజ్ నేతృత్వంలో కమిటీ కొల్లేరులో పర్యటించి నివేదిక అందించింది. ఆ నివేదికలో కూడా పర్యావరణానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్ మరణాంతరం 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కొల్లేరుపై సబ్కమిటీ వేస్తానని చెప్పారు. ఆ హామీలన్నీ నీటిమూటలుగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం వస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు ఏ మేరకు న్యాయం చేస్తారా అని కొల్లేరు ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. కొల్లేరు ప్రజలు వలసపోతున్నారు కొల్లేరు ప్రజలు ఉపాధిలేక వలస పోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లేరు 5 నుంచి 3వ కాంటూరు వరకు కుదించాలి. పేదలకు భూములు పంచాలి. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి. కొల్లేరు మత్స్యకారుల వేటకు ఉపయోగించే వలలను శుక్రవారం జరిగే కేంద్రమంత్రుల సమావేశంలోనైనా పంపిణీ చేయాలి. - దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ కైకలూరు సమన్వయకర్త మిగులు భూములు పంచాలి కొల్లేరు కాంటూరును కుదించి మిగులు భూములను ప్రజలకు పంపిణీ చేయాలి. కాంటూరు కుదింపు అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. కొల్లేరు ఆపరేషన్ సమయంలో జిల్లాలో అదనంగా ధ్వంసం చేసిన 7,500 ఎకరాల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. ఈ భూములను ముందుగా పంపిణీ చేస్తే కొల్లేరు ప్రజలకు ఊరట కలుగుతుంది. - జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే, కైకలూరు కాంటూరు కుదింపు ప్రమాదం కాంటూరు కుదింపు కొల్లేరు మనుగడకే ప్రమాదం. ఇప్పటికే కొల్లేరుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో అదనంగా ధ్వంసం చేసిన 7,500 ఎకరాలను పంపిణీ చేయాలి. గోదావరి నది నుంచి కొల్లేరుకు నీరు చేరేలా ప్రణాళిక రూపొందించాలి. కొల్లేరులో రెగ్యులేటర్ నిర్మించాలి. దీనివల్ల కొల్లేరులో నీరు ఎప్పుడూ నిల్వ ఉంటుంది. - ఎర్నేని నాగేంద్రనాథ్, కొల్లేరు సరస్సు పునరుద్ధరణ సమితి అధ్యక్షుడు ఆశలు అడియాసలు చేయొద్దు కొల్లేరు ప్రజలు కాంటూరు కుదింపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గతంలో మంత్రులు ఇచ్చిన వాగ్దానాలు అమలు కాలేదు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ మాగంటి బాబు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. కొల్లేరు ఆపరేషన్ సమయంలో చెరువులు కోల్పోయిన జిరాయితీ రైతులు అనేక కష్టాలు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లేరు సమస్యలపై సానుకూలంగా స్పందించాలి. - నబిగారి రాంబాబు, కొల్లేరు అభివృద్ధి సంఘ జిల్లా అధ్యక్షుడు
Related News by category
-
పిల్లలతో రైలు ప్రయాణం మరింత భారం!
వేసవి సెలవుల్లో పిల్లలతో రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే మీపై మరింత భారం పడనుంది. భారతీయ రైల్వే ప్రయాణ టిక్కెట్లపై ఐచ్ఛిక బీమా నిబంధనలలో పలు మార్పులు చేసింది. ఇకపై రైలు ప్రయాణంలో పిల్లలకు హాఫ్ టికెట్ తీసుకుంటే వారికి ఐచ్ఛిక బీమా ప్రయోజనం లభ్యకాదు.ఐఆర్సీటీసీ తెలిపిన వివరాల ప్రకారం ఇకపై పిల్లలకు పూర్తి టిక్కెట్ తీసుకుంటేనే బీమా సౌకర్యంలోని ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మరోవైపు ఐఆర్సీటీసీ ప్రత్యామ్నాయ బీమా ప్రీమియంను కూడా పెంచింది. ఏప్రిల్ ఒకటి నుంచి ఒక్కో ప్రయాణికుడి ప్రీమియం 45 పైసలకు పెంచింది. గతంలో ఇది 35 పైసలు ఉండేది.ఐచ్ఛిక బీమా పథకం అందించే ప్రయోజనం ఈ-టికెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రైల్వే టికెట్ కౌంటర్ నుండి కొనుగోలు చేసే టిక్కెట్లపై ఈ బీమా పథకం వర్తించదు. ఆన్లైన్ లేదా ఈ-టికెట్ను కొనుగోలు చేసిన వారికే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు వారు బీమా సౌకర్యాన్ని పొందాలనుకుంటున్నారా లేదా అనేది ఎంచుకోవాలి. ప్రయాణీకుడు బీమా సౌకర్యాన్ని పొందాలనుకుంటే, అతను ఆ ఎంపికపై క్లిక్ చేయాలి. అప్పుడు రైల్వే ప్రయాణీకుడి మొబైల్, ఈ-మెయిల్కు బీమా కంపెనీ నుండి సందేశం వస్తుంది.ఈ బీమా పథకం కింద రైల్వే ప్రయాణీకులు మరణిస్తే రూ.10 లక్షలు, పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే రూ.7.5 లక్షలు, గాయాలపాలైతే చికిత్స కోసం కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తారు. రైల్వే ప్యాసింజర్ ఐచ్ఛిక బీమా పథకాన్ని భారతీయ రైల్వే సెప్టెంబర్ 2016లో ప్రారంభించింది. -
అమేథీలో కాంగ్రెస్ 1981 ఫార్ములా?
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ నుంచి పోటీ చేయనున్నారని ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు అంటున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయమై నోరు మెదపలేదు. అయితే పార్టీ 1981 నాటి ఉప ఎన్నికల ఫార్ములాను ఇప్పుడు అనుసరించనున్నదనే మాట వినిపిస్తోంది.1981లో కాంగ్రెస్ నామినేషన్ల పర్వం ప్రారంభమైన తర్వాతనే అభ్యర్థులను రంగంలోకి దించింది. రాజీవ్ గాంధీని యూపీలోని అమేథీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన రోజునే రాజీవ్ గాంధీ తన నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఇదే విధానాన్ని కాంగ్రెస్ అనుసరించనున్నదని కొందరు పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.మరోవైపు అమేథీలో బీజేపీ మినహా ఏ పార్టీ కూడా అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఎస్పీ-కాంగ్రెస్ పొత్తులో అభ్యర్థి ఎవరనేదానిపై బీఎస్పీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అదేసమయంలో బీఎస్పీ అభ్యర్థి ఖరారైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది.ఇప్పటి వరకు రాహుల్ గాంధీ తాను అమేథీ నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు. అమేథీ నుంచి బీజేపీ తరుపున స్మృతి ఇరానీ ఎన్నికల రంగంలోకి దిగారు. కాగా రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ ప్రకటించారు. -
నేడు అమేథీలో స్మృతి ఇరానీ నామినేషన్
ఈరోజు (ఆదివారం) భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మహిళా నేత స్మృతి ఇరానీ యూపీలోని అమేథీ లోక్సభ స్థానానికి తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి ముందు ఆమె అయోధ్యలోని రామ్లల్లాను దర్శించుకోనున్నారు. అనంతరం ఆమె తన లోక్సభ నియోజకవర్గానికి వెళ్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. మే 20న అమేథీలో ఐదో దశలో ఓటింగ్ జరగనుంది. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం (ఏప్రిల్ 26) ప్రారంభమైంది. ఐదో దశలో మొత్తం 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది.అమేథీలో నామినేషన్కు చివరి తేదీ మే 3. దీంతో కాంగ్రెస్కు ఈ సీటు నుంచి పోటీచేయబోయే అభ్యర్థిని ప్రకటించడానికి ఎక్కువ సమయం లేదు. కాంగ్రెస్ పార్టీ అమేథీలో తన అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదు. అయితే రాహుల్ గాంధీ ఈ స్థానం నుండి మరోసారి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమేథీ నియోజకవర్గం చాలాకాలంపాటు గాంధీ కుటుంబం ఆధీనంలో ఉంది. అయితే 2019లో రాహుల్ను ఓడించడం ద్వారా స్మృతి ఇరానీ ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యానికి స్వస్తి పలికారు. అయితే ఇప్పుడు స్మృతిని ఓడించి, కాంగ్రెస్ కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందేందుకు రాహుల్ ప్రయత్నించనున్నారని సమాచారం.అమేథీతో పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ఎవరికీ టిక్కెట్ కేటాయించలేదు. ఈ సీటు కూడా కాంగ్రెస్ సంప్రదాయ సీటు. 2019లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇదే. సోనియాగాంధీ ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆమె ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీటు నుంచి సోనియా కుమార్తె ప్రియాంక ఎన్నికల బరిలో దిగవచ్చని తెలుస్తోంది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తున్నప్పటికీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా?
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైల్లో ఉన్నంత వరకూ మేయర్ ఎన్నిక వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రిసైడింగ్ అధికారిని నామినేట్ చేసే హక్కు ఎల్జీకి ఉన్నప్పటికీ, ప్రిసైడింగ్ అధికారిగా ఎవరిని నామినేట్ చేయాలనే విషయంలో సీఎం సూచన తప్పనిసరి. సీఎం జైలులో ఉన్నందున సంబంధిత ఫైలును ఢిల్లీ ప్రధాన కార్యదర్శి ఎల్జీ కార్యాలయానికి పంపించాల్సి వచ్చింది.ప్రిసైడింగ్ అధికారిని నామినేట్ చేయకపోవడంతో ఏప్రిల్ 26న మేయర్ ఎన్నిక జరగలేదు. దీంతో ప్రస్తుత మేయర్ షెల్లీ ఒబెరాయ్ తన బాధ్యతలను కొనసాగించనున్నారు. ఆమె ఎంసీడీ సాధారణ సమావేశాలను నిర్వహించడాన్ని కొనసాగిస్తునే ఉంటారు. అయితే ఇటువంటి సందర్భాల్లో ఆర్థిక, విధానపరమైన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. -
కుతుబ్ మినార్పై కొత్త థీమ్ - వీడియో
ఢిల్లీ: ఏడు దశల లోక్సభ ఎన్నికలకు ఏప్రిల్ 19న (మొదటి దశ) ఓటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రజలకు ఓటు హక్కు మీద అవగాహన కల్పించడానికి ఎన్నికల సంఘం ఓ వినూత్న పద్దతిని ఎంచుకుంది.కుతుబ్ మినార్ మీద త్రివర్ణ పతాకంతో పాటు.. మిరమిట్లు గొలిపే ఎన్నికల సంఘం లోగో కనిపించింది. ఎన్నికల నేపధ్యానికి సంబంధించిన లైట్లు, పోస్టర్లు, విజువల్స్ అన్నీ కుతుబ్ మినార్ మీద ఆకర్షణీయంగా కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన ఎక్స్ (ట్విటర్) పేజీలో పోస్ట్ చేసింది.ఇప్పటికే రెండు దశల ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. మే 3న మూడో దశ, మే 13న నాలుగో దశ, మే 20న ఐదో దశ, మే 25న ఆరో దశ, జూన్ 1న ఏడో దశలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడతాయి.Qutub Minar radiates the spirit of Jash-e-Matdan with its dazzling display of the #ChunavKaParv theme.Let's celebrate this festivity by casting our votes #GeneralElections2024📹 @ceodelhi #DeshKaGarv #LokSabhaElections2024 #YouAreTheOne pic.twitter.com/NPhlifadmT— Election Commission of India (@ECISVEEP) April 27, 2024
Advertisement
Photos
View allVideo
View allహైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement