బైక్ గ్యాంగ్‌ల మధ్య కాల్పులు; 9 మంది మృతి | Sakshi
Sakshi News home page

బైక్ గ్యాంగ్‌ల మధ్య కాల్పులు; 9 మంది మృతి

Published Tue, May 19 2015 1:40 AM

బైక్ గ్యాంగ్‌ల మధ్య కాల్పులు; 9 మంది మృతి

హ్యూస్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఆదివారం రెండు వైరి పక్షాలకు చెందిన నిషేధిత బైక్ గ్యాంగ్‌ల సభ్యులు పరస్పరం కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇరు పక్షాలకు చెందిన 9 మంది సభ్యులు మృతిచెందగా మరో 18 మంది గాయపడ్డారు. టెక్సాస్‌లోని వాకోలో భారత సంతతి వ్యక్తి నడుపుతున్న ఓ స్పోర్ట్స్ బార్ ఆవరణలో ఈ దారుణం జరిగింది.

ట్విన్‌పీక్స్ రెస్టారెంట్‌లో భేటీకి ఐదు బైక్ గ్యాంగ్‌లకు చెందిన సుమారు 150 నుంచి 200 మంది సభ్యులు చేరుకున్నారని...రెస్టారెంట్‌లోని ఓ బాత్రూంలో తలెత్తిన వివాదం చివరకు కత్తిపోట్లు, కాల్పుల వరకూ దారితీసిందని పోలీసులు తెలిపారు.

ముఠా సభ్యుల మధ్య ఘర్షణ జరగొచ్చని ఊహించిన పోలీసులు ముందుగానే అక్కడ మోహరించినా పరిస్థితి అదుపు తప్పింది. కాల్పుల ఉదంతానికి సంబంధించి 192 మందిపై అభియోగాలు నమోదయ్యాయి.

Advertisement
Advertisement