సిడ్నీ: ఇదొక సభ్య సమాజం తలదించుకునే ఘటన. కంటికి కనిపిస్తే రాళ్లతో కొట్టి చంపాలన్నంత ఆగ్రహం తెప్పించే దుర్మార్గం. కన్నతండ్రి కామాంధుడిగా మారగా అతడికి ఎలా సహకరించాలో చెబుతూ మాతృత్వానికి తీరని మచ్చ తెచ్చిన ఓ పైశాచిక తల్లి దౌర్భాగ్య ప్రవర్తన. అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన కూతురుకి ఐదేళ్ల ప్రాయం నుంచే నరకం చూపించడం మొదలుపెట్టి ఆస్ట్రేలియాలో ఓ తల్లిదండ్రులు దుర్మార్గానికి పాల్పడ్డారు. పది హేనేళ్లుగా తండ్రి ఆ బిడ్డను చిత్ర హింసలకు గురి చేస్తూ లైంగిక దాడికి పాల్పడగా అలాంటి చర్యను ప్రతిఘటించాల్సిన తల్లి అతడికి సహకరించింది.
కూతురుని ఇష్టమొచ్చినట్లు కొడుతూ అతడికి సహకరించాలంటూ చిత్రవద చేసింది. ఆ బాధిత యువతికి ఇప్పుడు 24 ఏళ్లు. ఎట్టకేలకు ఆ కసాయి తల్లిదండ్రులు జైలు పాలయ్యారు. అతడికి 48 ఏళ్ల జైలు శిక్ష విధించగా ఆమెకు 16 ఏళ్ల జైలు శిక్ష, 11 ఏళ్ల సామాజిక సేవను శిక్షగా విధించారు. వివరాల్లోకి వెళితే, ఆస్ట్రేలియాలో ఓ 59 ఏళ్ల వ్యక్తి, 51 ఏళ్ల మహిళ భార్య భర్తలుగా ఉన్నారు. వారికి ఒక కూతురు ఉంది. ఆ కూతురుకి ఐదేళ్లు వచ్చాక తీసుకెళ్లి వారి ఇంటి ఎదురుగా ఉన్న షెడ్డులో కట్టిపడేశారు. అనంతరం తమ దుశ్చర్యలు మొదలు పెట్టారు. అలా పది హేనేళ్లపాటు ఆమెపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఈ క్రమంలో పదునైన వస్తువులు ఆ బాలిక శరీరంపై గుచ్చుతూ చిత్రవద చేశారు. మిరపకాయలు తినిపించారు. తాము చెప్పినట్లు చేయకుంటే గొంతు తెగకోస్తామంటూ చిన్న సైజు రంపపు బ్లేడుతో గాయాలు చేశారు. ప్రస్తుతం మానసిక వైద్యాలయంలో చికిత్స పొందుతున్న ఆ బాధిత యువతి 2011లో తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రెండేళ్లపాటు విచారణ చేసి 2013లో వారిని అరెస్టు చేయగా వారికి శుక్రవారం కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఆ తండ్రి 73 నేరాలకు పాల్పడగా ఆమె మొత్తం 13 నేరాలకు పాల్పడినట్లు కోర్టు నిర్దారించింది. వారు చేసిన చర్యలపట్ల సిడ్నీ కోర్టు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
ఇదొక తండ్రి దారుణం.. మాతృత్వానికి మచ్చ
Published Fri, Oct 28 2016 1:30 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇజ్రాయెల్ దాడిలో రఫాలో 19 మంది మృతి
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రత
No Headline
రైలు కింద పడి భార్యాభర్తలు ఆత్మహత్య
రూ.19 కోట్ల ‘ఉపాధి’ నిధులు విడుదల
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
మసాలాలో పురుగుమందులు.. నివేదికలను తోసిపుచ్చిన ప్రభుత్వ సంస్థ
5 నిముషాల్లో పనయింది
నగర పంచాయతీ ‘మార్పు’
ఇంట్లోనే ఓటేశారు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement