వధువుల పరుగో పరుగు | Sakshi
Sakshi News home page

వధువుల పరుగో పరుగు

Published Mon, Nov 30 2015 9:01 PM

వధువుల పరుగో పరుగు

బ్యాంకాక్: థాయ్ లాండ్లో వధువుల పరుగు పోటీలు ఆకట్టుకున్నాయి. ఇది ఏదో సరదాకోసం జరిగిన పరుగు పోటీలు అనుకుంటే పొరపాటే. ఈ పోటీల్లో విజేతలకు అక్షరాల 27,928 యూఎస్ డాలర్లు(దాదాపు రూ.18.62లక్షలు ) నగదు బహుమతి ఉండటంతో పోటీల్లో పాల్గొన్న వధువులు చాలా సీరియస్గానే ప్రయత్నించారు. అంతేకాకుండా ఈ పోటీల్లో పాల్గొనే వారు తప్పకుండా తమ వెడ్డింగ్ గౌన్లనే ధరించాలనే నిబంధన ఉంది. 'రన్నింగ్ ఆఫ్ ది బ్రైడ్స్' పేరుతో జరిగిన ఈ పోటీల్లో పొడగాటి గౌన్లను ధరించి తమ కాబోయే భర్తలతో కలిసి పరుగెత్తారు. ఎవరైతే ముందుగా లక్ష్యాన్ని చేరుకుంటారో ఆ జంటను విజేతగా ప్రకటిస్తారు.  

అయితే ఈ పోటీల వేనుక మరోకోణం కూడా ఉంది. ఖరీదైన వివాహా వేడుకలకు అడ్డాగా చేసేందుకు, బ్యాంకాక్ ఇలాంటి పోటీలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. బ్యాంకాక్ టూరిజం ఆథారిటీ తెలిపిన లెక్కల ప్రకారం బ్యాంకాక్లో ఖరీదైన వివాహాలు చేసుకునే దేశాల్లో భారత్ ముందంజలో ఉంది.    

Advertisement

తప్పక చదవండి

Advertisement