బ్లీచ్తో స్నానం చేసి కరోనాను అంతమొందించానంటోంది సీఎన్ఎన్ ఛానల్ యాంకర్ క్రిస్ కౌమోస్ భార్య క్రిస్టియానా. గత నెలలో క్రిస్ కౌమోస్ దంపతులకు కరోనా సోకింది. ఈ మధ్యే వారు దాన్నుంచి బయటపడ్డారు. ఈ సందర్భంగా క్రిస్టియానా మాట్లాడుతూ.. కరోనా సోకిన సమయంలో తను స్నానం చేసే నీటిలో బ్లీచ్ కారకం వేసుకున్నానంది. ఓ అరకప్పు క్లోరాక్స్ను గోరు వెచ్చని నీళ్లలో వేసుకుని వాటితో స్నానం చేసేదాన్నని పేర్కొంది. తద్వారా శరీరంలోని రేడియేషన్తో పోరాటం చేసి కరోనాను తరిమేశానని పేర్కొంది. దీనిపై స్పందించిన నిపుణులు బ్లీచ్ చర్మానికి అంత సురక్షితం కాదని చెప్తున్నారు.
మరోవైపు అది రసాయనకారి అయినందున స్నానం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లీచింగ్ను వాడరాదని క్లోరాక్స్ సంస్థ హెచ్చరిస్తోంది. గతంలో అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. బ్లీచింగ్ వంటి రసాయన పదార్థాలు జబ్బును నయం చేస్తాయని ఇంతవరకూ ఎక్కడా నిరూపితం కాలేదని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా వుండగా ఉత్తర ప్రేదేశ్లో వలస కార్మికులపై బ్లీచింగ్ పౌడర్ వంటి కెమికల్ కారకాలను చల్లడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం విదితమే. (కరోనాకు నలుగురు బాయ్ఫ్రెండ్స్.. ఓ క్రష్ కూడా)