రూ. 5 కోట్లతో జల్సా చేసేసింది | Sakshi
Sakshi News home page

రూ. 5 కోట్లతో జల్సా చేసేసింది

Published Fri, Mar 11 2016 12:59 PM

రూ. 5 కోట్లతో జల్సా చేసేసింది - Sakshi

పేరు జూలియా హోగ్. వయస్సు 43 ఏళ్లు. వృత్తి బ్రిటన్ లోని లీడ్స్ నగరంలోని లీడ్స్ సిటీ కాలేజీలో కాలేజీ అడ్మినిస్ట్రేటర్. ఆమె విలాసవంతమైన జీవన శైలికి అలవాటు పడి... కోరి కష్టాలు తెచ్చుకుంది. వచ్చే జీతం తక్కువ కావడంతో చిన్నారి విద్యార్థుల కోసం వెచ్చించాల్సిన నిధులు కైంకర్యం చేసి... ఆ నిధులను తన భర్త, స్నేహితులతోపాటు బంధువుల కోసం నీళ్లులా ఖర్చు పెట్టింది. ఆ ఖర్చు ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. అవి అక్షరాల రూ. 500,000 పౌండ్లు. అదే భారత కరెన్సీలో అయితే దాదాపు రూ. 4.76 కోట్లు.

గతేడాది అక్టోబర్లో లీడ్స్ సిటీ కాలేజీలో జరిగిన అడిటింగ్లో నిధులు భారీగా దారి మళ్లిన విషయాన్ని గుర్తించారు. చిన్నారుల కోసం విదేశాల నుంచి వచ్చే నిధులు పెద్ద మొత్తంలో ఉంటాయి. అయితే వాటిని జూలియా హోగ్ తన సొంత బ్యాంకు అకౌంట్కు మళ్లించినట్లు గమనించారు. అందులో భాగంగా ఆమెను పోలీసులకు అప్పగించారు. 

పోలీసుల విచారణలో అసలు విషయాలు బహిర్గతమవడంతో  చేసిన నేరం ఒప్పుకుంది.  జూలియాకు కోర్టు మూడేళ్ల ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. ఈ కేసుపై న్యాయవాది రాబర్ట్ గ్యాలీ మాట్లాడుతూ... జూలియా హోగ్ ఒక్క ఏడాది 141,00 పౌండ్ల నగదు దొంగలించిందని చెప్పారు. అలా ఆమె ఈ ఉద్యోగంలో చేరే నాటి నుంచి గతేడాది అక్టోబర్ వరకు రూ. 479,379 పౌండ్లు ఖర్చు చేసేసిందన్నారు.  

2009లో లీడ్స్ సిటీ కాలేజీలో జూలియా అటెండెంట్గా చేరింది. అనతి కాలంలోనే ఆమె ఇంచార్జ్ స్థాయికి ఎదిగింది. ఆమె నెల జీతం 14,800 పౌండ్లు ఉండేదని చెప్పారు. జూలియా హోగ్ దెబ్బకు లీడ్స్ సిటీ కాలేజి కొత్త అకౌంట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement