వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా కరోనా కాటుకి తల్లడిల్లిపోతోంది. కంటికి కనిపించని సూక్ష్మ క్రిమి అతి పెద్ద దేశాన్ని పెనుభూతంలా భయపెడుతోంది. ఒకే రోజులో 16 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య దాదాపుగా 86వేలకు చేరుకుంది. చైనా (81,782), ఇటలీ (80,589)ని మించిపోయేలా కేసులు నమోదు కావడంతో ప్రపంచ పెద్దన్న వెన్నులో వణుకు పుడుతోంది. ఒక వారంలో కేసుల సంఖ్య పది రెట్లు పెరిగి ఉప్పెనలా ముంచెత్తడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అయితే మరణాల సంఖ్యలో చైనా, ఇటలీ కంటే తక్కువగా ఉండడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఇప్పటికి 1300 మందికిపైగా ఈ వైరస్తో మరణిస్తే చైనాలో 3,300 మంది, ఇటలీలో 8,250 మంది మరణించినట్టు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.
చైనా గణాంకాలు తప్పుడు తడకలేనా
కరోనా కేసుల్లో అమెరికా చైనాని మించి పోవడంతో ఆ దేశం వెల్లడిస్తున్న అధికారిక లెక్కలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేశారు. వాస్తవంగా చైనాలో ఎంత మందికి సోకింది? ఎందరు మరణించారు? అన్న వివరాలు తెలీవన్నారు. తమ దేశంలో టెస్టింగ్ కిట్లు అన్ని రాష్ట్రాల్లో లభిస్తుండడం వల్ల కేసుల సంఖ్య సరిగ్గా తెలుస్తోందన్నారు. వైట్హౌస్ కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ డెబోరా బ్రిక్స్ మొత్తం కేసుల్లో 55శాతం న్యూయార్క్లో నమోదు కావడం ఆందోళన రేపే అంశమన్నారు. 19 రాష్ట్రాల్లో 200 కంటే తక్కువ కేసులు ఉన్నాయన్నారు.
న్యూయార్క్ ఆస్పత్రులు కిటకిట
దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో సగం న్యూయార్క్ సిటీలో నమోదు కావడంతో అక్కడ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదనపు పడకలతో కూడిన ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని వైద్య సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. మొదట్లో వృద్ధులు, ఇతర జబ్బులు ఉన్న వారే ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇప్పుడు 50, 40 ఏళ్ల వయసులో ఉన్న వారు మరణించడం అత్యంత ఆందోళన కలిగించే అంశమని స్థానిక ఆస్పత్రికి చెందిన వైద్యుడు ఒకరు చెప్పారు. ప్రజలు ఎవరూ రక్షణ చర్యలు చేపట్టడం లేదని, చేతులు శుభ్రంగా కడుక్కోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అగ్రరాజ్యం అతలాకుతలం
Published Sat, Mar 28 2020 5:22 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- ప్రోటీన్ సప్లిమెంట్లను వినియోగించొద్దు! హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- హోర్డింగ్ కూలి 14 మంది మృతి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
- మళ్లీ హెడ్కోచ్గా రవిశాస్త్రి?
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- ‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
Advertisement