ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్పై ట్రంప్
వాషింగ్టన్/వాటికన్ సిటీ: పిచ్చివాడి చేతిలో అణ్వాయుధాలు ఉన్నాయంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 29న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో దుతర్తెతో ఫోన్లో మాట్లాడిన సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సంభాషణలను అమెరికా మీడి యా మంగళవారం విడుదల చేసింది. ఈ ఫోన్ మాట్లాడిన కొన్ని రోజులకే కిమ్ను కలవడం గౌరవంగా భావిస్తానని ట్రంప్ బహిరంగంగా చెప్పడం తెలిసిందే.
ట్రంప్ భారీ కాయంపై పోప్ జోక్
ట్రంప్ బుధవారం తన భార్య మెలానియా, కూతురు ఇవాంక సమేతంగా పోప్ ఫ్రాన్సిస్ను వాటికన్ సిటీలో కలిశారు. ప్రపంచమంతా శాంతిని వ్యాప్తి చేసేందుకు అధ్యక్ష పదవిని ఉపయోగించాలని పోప్ ఫ్రాన్సిస్ ట్రంప్కు సూచించారు. ట్రంప్ లావుగా ఉండటంపై భేటీ సమయంలో పోప్ మెలానియాతో ఒక జోక్ కూడా వేశారు. ‘మీరు ఆయనకు ఏం పెడతారు? పొటీజ్జా?’ అని మెలాని యాను పోప్ అడిగారు. మెలానియా సొంత దేశమైన స్లొవేనియాలో దొరికే పొటీజ్జా్జ అనేది కెలరీలు ఎక్కువగా లభించే ఓ వంటకం.
ట్రంప్తో చేయి కలపని మెలానియా
ఇటలీలో విమానం నుంచి దిగుతున్న సమయంలో మెలానియా చేయి పట్టుకోడానికి ట్రంప్ యత్నించగా ఆమె నిరాకరించింది. చేయి పట్టుకోడానికి ట్రంప్ యత్నిస్తుండగా ఆమె చేయి విదిలించుకుని తన చేతితో జుట్టు ను సరిచేసుకుంది. ఇది కెమెరాలకు చిక్కడంతో నెటిజన్లు ట్విటర్లో జోకులు పేల్చారు.
Breadcrumb
పిచ్చివాడి చేతిలో అణ్వాయుధాలు
Published Thu, May 25 2017 12:40 AM
Related news
-
అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నా: యూఎస్ ప్రెసిడెంట్
న్యూయార్క్: ఆత్మ హాత్మ చేసుకోవాలనే ఆలోచనలు తనకు వచ్చాయని.. వెంటనే వాటి నుంచి బయటపడ్డానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డెలావేర్ మెమోరియల్ బ్రిడ్జ్ వద్దకు వెళ్లిన తాను అక్కడి నుంచి దూకి ఆత్మచేసుకోవాలనే ఆలోచన వచ్చిందన్నారు. అయతే తన పల్లల గురించి ఆలోచించి... ఆత్మహత్య చేసుకుకోవాలన్న నిర్ణయాన్ని విరమించుకున్నని తెలిపారు. 1972 సంవత్సరంలో తొలిసారి సెనేటర్గా గెలుపొందిన కొన్నిరోజులకు బైడెన్... తన భార్య నీలియా, 18 నెలల బాబు రోడ్డు ప్రమాదంలో దూరమయ్యారని వెల్లండించారు. ఆ సమయలో చాలా బాధలో ఉన్న తనకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని చెప్పారు.ఆ బాధలో తాగటం అలవాటు లేని తాను మందు బాటిల్ తీసుకొని డెలావేర్ బ్రిడ్జ్ వద్దకు వెళ్లి తాగుతుండగా.. ఆత్మహత్య ఆలోచన వచ్చిందన్నారు. కానీ, తన మిగతా ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఆలోచించి.. ఆ నిర్ణయాన్ని విరమించుకున్నానని తెలిపారు. కష్టాలు వచ్చినప్పుడు వచ్చి ఆత్మహత్య చేసుకోవాలన్న పిచ్చి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. అదే విధంగా మరో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడుతూ.. అమెరికా ఎన్నికలకు ముందే డిబేట్లో పాల్గొనాలని ఉన్నట్లు తెలిపారు. ఎక్కడైనా ఓ చోట ట్రంప్తో డిబేట్ తనకు సంతోషమన్నారు. దీనిపై ట్రంప్ సైతం ప్రతిస్పందించారు. ‘ నేను సిద్ధంగా ఉన్నాను. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సమయానికైనా బైడెన్తో డిబేట్కు అంగీకరిస్తున్నా’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.ఇక.. అధ్యక్ష పదవి ఎన్నికల డిబేట్ల ఎన్నికల తేదీలు, వేదికల వివరాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 16న టెక్సాస్లోని శాన్ మార్కోస్, అక్టోబర్ 1న వర్జీనియాలోని పీటర్స్బర్గ్, అక్టోబర్ 9న సాల్ట్ లేక్ సిటీలో జరగనున్నాయి. -
Donald Trump: పాత కేసులో కొత్త చిక్కులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ పాత కేసులో కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. హష్ మనీ కేసు ఆయన మెడకు చుట్టుకుంటోంది. గత ఎన్నికల్లో ఆయన మోసానికి పాల్పడ్డారని ప్రాసిక్యూషన్ వాదిస్తుండగా.. ఇది కుట్ర అంటూ ఎదురుదాడి చేస్తున్నారు ట్రంప్.అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మోసానికి పాల్పడ్డారా..?అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన డొనాల్డ్ ట్రంప్నకు వరుస షాక్లు తగులుతున్నాయి. పోర్న్స్టార్తో అనైతిక ఒప్పందం కేసులో ఆయన చుట్టూ బలంగా ఉచ్చు బిగిస్తోంది. ఈ వ్యవహారంతో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మోసానికి పాల్పడ్డారన్నది ప్రాసిక్యూషన్ వాదన.స్టార్మీ డేనియల్స్కు డబ్బులు ఇచ్చి అఫైర్ను కప్పిపుచ్చిన ట్రంప్!2016 ఎన్నికల ప్రచార సమయంలో.. శృంగార తార స్టార్మీ డేనియల్స్కు డబ్బులు ఇచ్చి ఆమెతో శారీరక సంబంధాన్ని బయటకు రాకుండా అనైతిక ఒప్పందం చేసుకున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ట్రంప్. ఈ నాన్డిజ్క్లోజర్ అగ్రిమెంట్ను రద్దు చేయాలంటూ రెండేళ్ల తర్వాత కోర్టును ఆశ్రయించింది స్టార్మీ. దీనిపై న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ డొనాల్డ్ ట్రంప్పై నేరారోపణలు నమోదు చేసింది.2016 ఎన్నికల సమయంలో ట్రంప్ మోసానికి పాల్పడ్డారు : ప్రాసిక్యూషన్తాజాగా ఈ కేసులో వాడీవేడి వాదనలు జరిగాయి. ప్రాసిక్యూటర్ తరపున వాదించిన మాథ్యూ కోలాంగెలో.. 2016 ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ మోసానికి పాల్పడ్డారన్నారు. తన పరువు పోకుండా ఉండేందుకు శతవిధాలా యత్నించారని.. ఇందుకోసం సెక్స్ స్కాండల్ను కప్పిపుచ్చేలా వ్యవహరించారని ఆరోపించారు. తన గురించి చెడుగా మాట్లాడకుండా కొందరి నోళ్లు మూయించడానికి ట్రంప్ డబ్బు ఖర్చు చేశారన్నారు. చట్టవిరుద్ధంగా జరిగిన ఆ ఖర్చు ఎన్నికలను ప్రభావితం చేసే అంశమేనని.. కచ్చితంగా ఇది ఎన్నికల మోసం కిందకే వస్తుందని బలంగా వాదించారు మాథ్యూ కోలాంగెలో.డొనాల్డ్ అమాయకుడు, ఎలాంటి నేరం చేయలేదు: ట్రంప్ తరపు న్యాయవాదులుప్రాసిక్యూషన్ అభియోగాలను ట్రంప్ తరఫు న్యాయవాదులు ఖండించారు. డొనాల్డ్ అమాయకుడని, ఎలాంటి నేరం చేయలేదని, అసలు మాన్హట్టన్ అటార్నీ ఆఫీస్ ఈ కేసును ఏనాడూ ప్రస్తావించలేదని వాదించారు. అధ్యక్ష ఎన్నికలకు దూరం చేసేందుకు ఇది తనపై జరుగుతున్న కుట్ర అని ఆరోపించారు డొనాల్డ్ ట్రంప్.అధ్యక్ష పదవిలో ఉండగా రెండుసార్లు అభిశంసన ఎదుర్కొని నెగ్గారు ట్రంప్. యూఎస్ కేపిటల్ మీద దాడి ఘటన, వైట్హౌస్ నుంచి కీలకమైన పత్రాల మిస్సింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు శృంగార కుంభకోణంలో కోర్టు విచారణ ద్వారా మరోసారి చిక్కుల్లో పడ్డారు. అమెరికా మాజీ అధ్యక్షుల్లో ఇలాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న తొలి వ్యక్తిగా చరిత్రకెక్కారు ట్రంప్. -
Trump: ఇది కుట్రే.. ఎన్నికల మోసానికి పాల్పడ్డారు!
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ తరపున మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిల్చొబోతున్న డొనాల్డ్ ట్రంప్నకు గడ్డు పరిస్థితులు తప్పడం లేదు. గతంలోని తన రాసలీలల బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆయన ఓ మాజీ శృంగార తారకు డబ్బు ఇచ్చి అనైతిక ఒప్పందానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ వ్యవహారంతో ఆయన అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా మోసానికి పాల్పడ్డారంటూ ప్రాసిక్యూషన్ బలంగా వాదిస్తోంది. 2016 ఎన్నికల ప్రచారం సమయంలో.. స్టార్మీ డేనియల్స్కు డబ్బులు ఇచ్చి ఆమెతో శారీరక సంబంధాన్ని బయటకు రాకుండా అనైతిక ఒప్పందం(నాన్డిజ్క్లోజర్ అగ్రిమెంట్) చేసుకున్నాడనే ఆరోపణలు ట్రంప్పై ఉన్నాయి. ఈ తరుణంలో.. సదరు ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ రెండేళ్ల తర్వాత ఆ పో*స్టార్ కోర్టును ఆశ్రయించింది. అటుపై ఆయన అధ్యక్ష పదవిలో ఉండడంతో హైప్రొఫైల్ కేసుగా దర్యాప్తు సంస్థలు విచారణ జరిపాయి. చివరికి.. న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ డొనాల్డ్ ట్రంప్ పై నేరారోపణలు చేసింది. తద్వారా అమెరికాలోనే తొలిసారిగా ఇలా నేరారోపణలు ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ పేరు చరిత్రకెక్కింది. అయితే తొలిరోజు విచారణ సందర్భంగా.. న్యూయార్క్ కోర్టులో వాడీవేడి వాదనలే జరిగాయి. ప్రాసిక్యూటర్ మాథ్యూ కోలాంగెలో వాదనలు వినిపిస్తూ.. 2016 ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ మోసానికి పాల్పడ్డారు. తన పరువు పోకుండా ఉండేందుకు శతవిధాల యత్నించారు. ఇందుకోసం సె* స్కాండల్ను కప్పి పుచ్చేలా వ్యవహరించారు. ట్రంప్ టవర్ ఇందుకు వేదిక అయ్యింది. ఇది దీర్ఘకాలికంగా, ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్ర. తన గురించి చెడుగా మాట్లాడకుండా కొందరి నోళ్లు మూయించడానికి ఆయన డబ్బు ఖర్చు చేశారు. చట్టవిరుద్ధంగా జరిగిన ఆ ఖర్చు ఎన్నికలను ప్రభావితం చేసే అంశమే. కచ్చితంగా ఇది ఎన్నికల మోసం కిందకే వస్తుంది’’ అయితే ట్రంప్ తరఫు న్యాయవాది టాడ్ బ్లాంచె మాత్రం ఆ అభియోగాలను ఖండించారు. ట్రంప్ అమాయకుడని, ఎలాంటి నేరం చేయలేదని, అసలు మాన్హట్టన్ అటార్నీ ఆఫీస్ ఈ కేసును ఏనాడూ ప్రస్తావించలేదని వాదించారు. ఇక ఈ కేసులో ఇంకా వాదనలు కొనసాగాల్సి ఉంది. ట్రంప్ గతంలో అధ్యక్ష పదవిలో రెండుసార్లు అభిశంసన తీర్మానం ఎదుర్కొని నెగ్గారు. యూఎస్ కాపిటల్ మీద దాడి ఘటన, అధ్యక్ష భవనం వైట్హౌజ్లో ఉన్నప్పుడు కీలకమైన పత్రాల మిస్సింగ్(వాటిని నాశనం చేశారనే ఆరోపణలు ఉన్నాయి).. తదితర అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు సె* స్కాండల్ కుంభకోణంలో గనుక ట్రంప్ కోర్టు విచారణ ద్వారా ఆయన జీవిత పుస్తకంలో మాయని మచ్చ ఏర్పడినట్లయ్యింది. -
‘అణు బాంబుల ధ్వంసం.. సీపీఎంపై రాజ్నాథ్ ఫైర్
తిరువనంతపురం: సీపీఎం పార్టీపై దేశ రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ఫైర్ అయ్యారు. కేరళలోని కాసర్గాడ్లో బుధవారం(ఏప్రిల్17) జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాజ్నాథ్సింగ్ మాట్లాడారు. ‘సీపీఎం అధికారంలోకి వస్తే దేశంలోని న్యూక్లియర్ ఆయుధాల(అణు బాంబులు)ను ధ్వంసం చేస్తామని చెబుతోంది. పొరుగు దేశాలు పాకిస్తాన్, చైనా న్యూక్లియర్ బాంబులను కలిగి ఉన్నప్పుడు మనం వాటిని వదులుకుంటే ఎలా. సీపీఎం తీరు దేశ భద్రతతో ఆటలాడినట్లుంది. సీపీఎం హామీపై కాంగ్రెస్ పార్టీ వెంటనే తన వైఖరి వెల్లడించాలి’అని రాజ్నాథ్ డిమాండ్ చేశారు. సీపీఎం, కాంగ్రెస్ కలిసి కేంద్రంలో దోచుకోవాలని చూస్తున్నాయని, ఇది తాము జరగనివ్వబోమని రాజ్నాథ్ చెప్పారు. కాగా, కేరళలో ఏప్రిల్ 26న రెండో దశలో భాగంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. తృణమూల్ మేనిఫెస్టో రిలీజ్.. కీలక హామీలివే -
ఎవరు గెలిస్తే ఇండియాకు మేలు?
భారతదేశ వ్యూహాత్మక అవసరాలు తీరేందుకు జో బైడెన్ అమెరికా అధ్యక్ష స్థానంలో ఉండటం అవసరం. అయితే డెమోక్రాట్లకు బీజేపీ అంటే అసలు పడటం లేదు. ట్రంప్కు బీజేపీ రాజకీయాలంటే పట్టింపేమీ లేదు కానీ.. ఎప్పుడెలా స్పందిస్తారో తెలియదు! అయితే, ట్రంప్ అధికారంలో ఉండగా ఇతర దేశాల కంటే చాలా తక్కువ నష్టం భారత్కు జరిగిన విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. చైనాతో ట్రంప్ తెగదెంపులు చేసుకోవడం వల్లనే ట్రంప్ ప్రభుత్వం పుల్వామా, గల్వాన్ ఘటనల్లో భారత్కు మద్దతుగా నిలిచింది. అయితే రెండోసారి అధికారం చేపడితే ట్రంప్ వ్యవహారశైలి ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించలేము. అలాంటి నేపథ్యంలో భారతీయ దౌత్యం అవసరం మరింత ఎక్కువవుతుంది. అమెరికా రాజకీయాలు... భారత్లో వాటి ప్రభావం అన్న అంశాన్ని తీసుకుంటే నాలుగు అంశాలు పరస్పర విరుద్ధంగా కనిపిస్తాయి. మొదటగా చెప్పు కోవాల్సింది చైనాను నియంత్రించే విషయంలో బైడెన్ ఇండో పసఫిక్ ప్రాంతంలో తీసుకున్న చర్యలు. ఈ చర్యలన్నీ బాధ్యతాయుతమైనవే కాదు, ఒక పద్ధతి ప్రకారం చేసినవి కూడా. కాకపోతే ఉక్రెయిన్, గాజా యుద్ధాల కారణంగా చైనాపై శ్రద్ధ కొంత తగ్గిందనడం కూడా సత్య దూరమేమీ కాదు. బైడెన్ నేతృత్వంలో క్వాడ్కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. జపాన్ తన మిలిటరీ ఆధునికీకరణ చేపట్టింది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా భద్రతాంశాలపై త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చు కున్నాయి. అలాగే జపాన్, ఫిలిప్పీన్్స, అమెరికా మధ్య కూడా ఒక ఒప్పందం కుదిరింది . ఫిలిప్పీన్్సలో అమెరికా ఉనికి మరింత పెరిగింది. ‘ఆకస్’(ఆస్ట్రేలియా, యూకే, యూఎస్) ప్రకటన జరిగింది. దక్షిణ పసిఫిక్ ద్వీపాల ప్రాముఖ్యతనూ అమెరికా గుర్తించడం గమ నార్హం. ఆసియాన్ నేతలకు వైట్హౌస్ ఆతిథ్యమిచ్చింది. తైవాన్లో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగింది. వియత్నాంతో అమెరికాబంధం మరింత దృఢపడింది. అలాగే చైనాపై అమెరికా కఠినమైనటెక్ నిషేధాలు కూడా విధించింది. ఇదే సమయంలో ఘర్షణ మరింత ముదరకుండా వ్యూహాత్మకంగా ఒకవైపు చైనాతో చర్చలు కొనసా గిస్తూనే మరోవైపు ఆ దేశంతో తన పోటీతత్వానికి మరింత పదును పెట్టింది. అమెరికా ఆలోచనల్లో భారత్ కనీసం నాలుగు విధాలుగా ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తుంది. ప్రపంచస్థాయి చర్చల్లో భారత్ కీలక మైన భాగస్వామి అని బైడెన్ ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. ఈ కారణంగానే భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సమావేశాలకు పూర్తి స్థాయిలో అమెరికా మద్దతిచ్చింది. ఐఎంఈసీ, ఐ2యూ2, క్వాడ్, ఐపీఈఎఫ్, మినరల్ సెక్యురిటీ పార్ట్నర్షిప్, ఆర్టిమిస్ అకార్డ్స్ వంటి వేర్వేరు వ్యవస్థల్లో భారత్ను కీలకంగా మార్చింది. ఇంధనం నుంచి ఆహార భద్రత, వాతావరణ మార్పులు మొదలుకొని కోవిడ్ వంటి మహమ్మారుల నిర్వహణ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన వంటి అన్ని ప్రపంచస్థాయి సమస్యల పరిష్కారంలో భారత్ భూమిక తప్పదన్న విషయం కూడా అమెరికా గుర్తించింది. భారత్ సామర్థ్యాన్ని పెంచడం ప్రపంచ సమస్యల పరిష్కార బాధ్యతను పంచుకోవడం అవుతుందని అమెరికా భావిస్తోంది. దీనివల్ల అటు చైనాను నియంత్రించడం, దక్షిణాసియా ప్రాంతంలో భద్రతను కాపాడటం కూడా సాధ్యమన్నది అమెరికా అంచనా. అలాగే సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి తగిన వ్యవస్థలను ఏర్పాటు చేయడం, కలిసికట్టుగా తయారీ చేపట్టడం, రక్షణ రంగంలో సహకారం, అమెరికాలోని పెద్ద పెద్ద కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెడుతూండటం భారత్పై పెరుగుతున్న అమెరికా విశ్వాసానికి నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. భారత్ భౌగోళిక స్వరూపం, ఇరుగు పొరుగు, చరిత్ర వంటి అనేక అంశాల ఆధారంగా బైడెన్ యంత్రాంగం ఈ దేశం తన ప్రయోజనాలు సాధించుకునేందుకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తోంది. కొన్నిసార్లు విభేదించినా భూ దక్షిణార్ధగోళం మొత్తమ్మీద భారత్ పరపతి చైనా కంటేఎంతో మెరుగని అమెరికా భావిస్తోంది. ఇక రెండో విషయానికి వద్దాం. డెమోక్రాట్లు ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీతో అంత సౌకర్యంగా ఏమీ లేరు. ఇందుకు మూడు కారణాలు కనిపిస్తాయి. ప్రజాస్వామ్యం విషయంలో పార్టీ ధోరణి మారిపోవడం ఇందులో ఇకటి. యూఎస్ కాంగ్రెస్లోని ఐదుగురు దేశీ ప్రతినిధులు డెమోక్రాట్లే కావడం గమనార్హం. ఆధిపత్య ధోరణులకు దూరంగా ఉండాలన్న కాంక్ష, మైనారిటీలకు గుర్తింపు ఉండాలన్న భావనలు వీరిని డెమోక్రాట్ పార్టీ వైపు మళ్లించాయి. జాతి ఆధారిత నేషనలిజమ్పై కూడా వీరికి నమ్మకం లేదు. బీజేపీ ఇప్పుడు ఈ విలువలన్నింటికీ దూరమన్న అంచనా డెమోక్రాట్లలో బలపడుతోంది. రెండో కారణం అమెరికన్ ముస్లింల ప్రభావం. డెమోక్రాట్లలో భార తీయ అమెరికన్ ముస్లింల ప్రభావం కూడా క్రమేపీ ఎక్కువ అవుతోంది. బైడెన్ గాజా విషయంలో ఇప్పటికే వీరి నుంచి కొంత వ్యతిరే కత ఎదుర్కొంటున్నారు. మిషిగన్ వంటి స్వింగ్స్టేట్లో దీని ప్రభా వమూ కనిపించింది. మూడో కారణం... డెమోక్రాట్లు ట్రంప్ రాజకీ యాలను వ్యతిరేకిస్తారు. ట్రంప్ ప్రజాస్వామ్యానికి ఎలా వ్యతిరేకం అన్న విషయంపై ఈ రాజకీయాలు మొత్తం ఆధారపడి ఉంటాయి. ఫలితంగా వీరు మానవహక్కుల వంటి విషయాలకు అనుకూలంగా ఉండాల్సి ఉంటుంది. పౌరసత్వ (సవరణ) చట్టం విషయంలో ఇటీవలి కాలంలో భారత్, అమెరికా మాటా మాటా అనుకున్న విషయం ఒకసారి గుర్తు చేసుకుందాం. అయితే ఈ విషయాలన్నింటినీ తప్పుకొని మరీ పని చేసేందుకు బైడెన్యంత్రాంగం ఒక మార్గాన్ని గుర్తించింది. అంశా లను బహిరంగంగా కాకుండా, ప్రైవేట్గా ప్రస్తావించడం. అడపాద డపా ఎవరైనా అడిగితే నర్మగర్భంగా బహిరంగ వ్యాఖ్యలు చేయడం. అమెరికాలో భారత్పై ఆందోళన చెందుతున్న బీజేపీయేతర పార్టీలకు సంఘీభావ సంకేతం పంపేందుకు ఇలా చేస్తుందన్నమాట. ఉన్నతా ధికారులు, నేతలకు మాత్రం విషయం సుస్పష్టం. మూడో అంశం... డోనాల్డ్ ట్రంప్ హ్రస్వదృష్టి. ఇందులో మైనారి టీలు, మతపరమైన అంశాలు, ఎన్నికల వ్యవస్థ చేతనావస్థ వంటి వాటికి చోటు లేదు. బహుశా క్రైస్తవుల హక్కుల గురించి ట్రంప్ కొంత ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సువార్తికులకు ఈయన కొంచెం తలొగ్గుతూంటారు.అధ్యక్ష ఎన్నికల్లో కొంచెం ముందున్న ట్రంప్ భారత్ ప్రయోజనా లకు అనుకూలంగా ఉంటాడని అనుకోలేము. అయితే, ట్రంప్ అధికా రంలో ఉండగా ఇతర దేశాల కంటే చాలా తక్కువ నష్టం భారత్కు జరిగిన విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. చైనాతో ట్రంప్ తెగదెంపులు చేసుకోవడం వల్లనే ట్రంప్ ప్రభుత్వం పుల్వామా, గల్వాన్ ఘటనల్లో భారత్కు మద్దతుగా నిలిచింది. అయితే రెండోసారి అధి కారం చేపడితే ట్రంప్ వ్యవహారశైలి ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించలేము. అమెరికాలో రాజకీయపరమైన అస్థిరత, విభజన ఉండటం ఉక్రెయిన్, యూరప్ దేశాల నిరుత్సాహానికి తద్వారా అమెరికా ప్రత్య ర్థులకు బలాన్ని ఇస్తుంది. అందుకే అమెరికా ప్రత్యర్థులు... డెమో క్రాట్లు అంటే ఇష్టం లేని కొందరు అమెరికా స్నేహితులు కూడా ట్రంప్ విజయాన్ని కోరుకుంటున్నారు. ఒక ఉదాహరణ తీసుకుందాం. బీజింగ్ ఇప్పటికే అమెరికా వ్యవ హారాన్ని తిరిగి మొదలుపెట్టింది. ట్రంప్కు సాయపడేలా ఎన్నికల్లో తప్పుడు ప్రచారాన్ని కూడా మొదలుపెట్టిందన్న వార్తలూ ఉన్నాయి. తన ప్రయోజనాలు కాపాడేలా చేస్తే వాణిజ్య పునరుద్ధరణ సాధ్యమే అని చైనా ట్రంప్కు సంకేతాలిచ్చినా ఆశ్చర్యం లేదు. టిక్టోక్ విష యంలో ట్రంప్ తన మునుపటి వైఖరిని మార్చుకున్న విషయంఇక్కడ చెప్పుకోవాలి. అమెరికన్ రాజ్యాంగంపై పోరు చేస్తామన్నట్రంప్ వ్యాఖ్య, వ్యాపార వాణిజ్య వ్యవహారాల్లో దుందుడుకుతనం, ఆసియా, యూరప్లలోని కొన్ని మిత్రదేశాలతోనూ దురుసుగా వ్యవహరించడం వంటివి చూస్తే ట్రంప్ మరోసారి అధికారంలోకి వస్తే ప్రపంచం మరోసారి గందరగోళంలో పడుతుందనేది మాత్రం వాస్తవం. అలాంటి నేపథ్యంలో భారతీయ దౌత్యం అవసరం మరింత ఎక్కువవుతుంది. ఈ విషయంలో భారత్ ఎంతో కొంత ఆందోళనచెందాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. - వ్యాసకర్త జర్నలిస్ట్ మరియు కాలమిస్ట్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)ప్రశాంత్ ఝా
Related News by category
-
ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా పలు విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళనలను కొనసాగిస్తున్నారు. తరగతి గదులను బహిష్కరించి పాలస్తీనాకు సంఘీభావంగా, మద్దతుగా నిరసనల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దీంతో అనేక యూనివర్సిటీల్లో విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.తాజాగా ప్రఖాత్య హార్వర్డ్ యూనివర్సిలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. హార్వర్డ్ యార్డ్లోని జాన్ హార్వర్డ్ విగ్రహంపై పాలస్తీనా జెండాను నిరసనకారులు ఎగువేశారు. అమెరికన్ జెండా కోసం కేటాయించిన స్థలంలో పాలస్తీనా జెండాను ఎగరేయడం గమనార్హం. ఐవీ లీగ్ స్కూల్ క్యాంపస్లో కొనసాగుతున్న తమ ఆందోళనలను ముగించేందుకు నిరాకరించడంతో శనివారం ఈ చర్యకు పాల్పడ్డారు. మరోవైపు నిరసనకారులతో పోలీసులు ఉక్కుపాదం మోన్నారు. గత వారం న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో 100 మందికిపైగా నిరసనకారులను అరెస్ట్ చేసిన తర్వాత నిరసనలు తీవ్రతరమయ్యాయి. దీంతో నిరసనకారులను స్థానిక పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. గత పదిరోజుల వ్యవధిలో అమెరికా వ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో అరెస్ట్ల సంఖ్య 900కు చేరుకుంది. అమెరికా వ్యాప్తంగా కొనసాగుతోన్న ఆందోళనలపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఆందోళనలు శాంతియుతంగా ఉండాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
లండన్లో బీజేపీ మద్దతుదారుల పాదయాత్ర
ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీకి అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా బ్రిటన్లోని ప్రవాస భారతీయులు, బీజేపీ మద్దతుదారులు లండన్లో రన్ ఫర్ మోదీ ఈవెంట్ను నిర్వహించారు. దీనిలో పెద్ద సంఖ్యలో ఎన్నారైలు పాల్గొని బీజేపీపై, ప్రధాని మోదీపై తమకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు.2019 ఎన్నికల సమయంలోనూ రన్ ఫర్ మోదీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేపీ యూకే ఓవర్సీస్ ఫ్రెండ్స్ ప్రధాన కార్యదర్శి సురేష్ మంగళగిరి తెలిపారు. నాడు కూడా ప్రజలు బీజేపీపై తమ అభిమానాన్ని ఇదే రీతిలో వ్యక్తం చేశారన్నారు. బీజేపీపై, ప్రధాని మోదీపై ఎన్నారైలకు అమితమైన ప్రేమ ఉన్నదన్నారు.అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 తొలగింపు తదితర మంచి పనులను బీజేపీ చేపట్టిందని సురేష్ పేర్కొన్నారు. లండన్లో నిర్వహించిన రన్ ఫర్ మోదీ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ మద్దతుదారులు ఆ పార్టీ జెండాలను చేత పట్టుకుని ‘భారత్ మాతా కీ జై’ ‘వందేమాతరం’ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో 400కు పైగా ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. -
రుణం కోసం ఐఎంఎఫ్ను సంప్రదించిన పాక్!
పొరుగు దేశం పాకిస్తాన్ రుణ సాయం కోసం మరోమారు చేయి చాచింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదివారం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా జార్జివాను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తమ దేశానికి కొత్త రుణం కోసం అభ్యర్థించారు.పాక్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఇఎఫ్) సమావేశంలో పాక్కు మూడు బిలియన్ యూఎస్ డాలర్లు ఎస్బీఏ కింద అందించేందుకు ఐఎంఎఫ్ మద్దతు ఇచ్చినందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వివరాలను పీటీవీ న్యూస్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో తెలిపింది. కాగా స్టాండ్బై అరేంజ్మెంట్ (ఎస్బీఏ) కింద 1.1 బిలియన్ డాలర్ల రుణంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సోమవారం సమావేశం కానుంది.గత ఏడాది జూన్లో జరిగిన ఐఎంఎఫ్ కార్యక్రమంలో పాకిస్తాన్ మూడు బిలియన్ డాలర్ల రుణం అందుకుంది. తాజాగా జరిగిన డబ్ల్యుఈఎఫ్ ప్రత్యేక సమావేశంలో పాక్ ప్రధాని షరీఫ్ ‘ప్రపంచ ఆరోగ్య అజెండాను పునర్నిర్వచించడం’పై జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య సంరక్షణలో ప్రపంచ అసమానతలను ప్రస్తావించారు. 2003లో సౌదీ అరేబియా వెళ్లినప్పుడు తనకు క్యాన్సర్ సోకిందని షరీఫ్ తెలిపారు. ఆ తర్వాత న్యూయార్క్కు వెళ్లి వేల డాలర్లు వెచ్చించి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇంతటి ఖరీదైన చికిత్సను తమ దేశంలోని ప్రజలు భరించలేరని తెలిపారు.తాను పాకిస్తాన్కు తిరిగి వచ్చినప్పుడు, పంజాబ్ ప్రావిన్స్కు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యానని, తమ ప్రభుత్వం కిడ్నీ, కాలేయ వ్యాధులతో పాటు క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన ప్రత్యేక ఆసుపత్రులను నిర్మించిందని షాబాజ్ చెప్పారు. కరోనా మహమ్మారి ప్రపంచంలోని ఆరోగ్య అసమానతలను, లోపాలను బహిర్గతం చేసిందని షరీఫ్ పేర్కొన్నారు. -
దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
దుబాయ్లో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దుబాయ్లో నిర్మించబోతున్నారు. ఈ మేరకు దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటన చేశారు. దీని కోసం 35 బిలియన్ డాలర్లు (రూ.2.9 లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నారు.వివరాల ప్రకారం.. దుబాయ్లో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం నిర్మించచోతున్నారు. ఈ విషయాన్ని దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ ఆదివారం ప్రకటించారు. ఈ విమానాశ్రయం పేరును అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలవనున్నట్లు ఆయన తెలిపారు. ఇది ఈ విమానాశ్రయాం నిర్మించడానికి 35 బిలియన్ డాలర్లు (రూ.2.9 లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నారు. ఏడాదికి 260 మిలియన్ల మంది రాకపోకలు కొనసాగించేలా ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.ఒక్క ఏడాదిలో దాదాపు 260 మిలియన్ల మంది ప్రయాణీకులు ఈ ఎయిర్పోర్టు ద్వారా ప్రయాణాలు కొనసాగించవచ్చన్నారు. ఈ విమానాశ్రయంలో ఐదు సమాంతర రన్వేలు, 400 ఎయిర్క్రాఫ్ట్ గేట్స్ దీని ప్రత్యేకతలుగా చెప్పారు. కాగా, అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రస్తుత దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంటే ఐదు రెట్లు పెద్దదిగా ఉంటుంది. రాబోయే సంవత్సరాల్లో దుబాయ్ ఎయిర్పోర్టు నుండి అన్ని కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. Today, we approved the designs for the new passenger terminals at Al Maktoum International Airport, and commencing construction of the building at a cost of AED 128 billion as part of Dubai Aviation Corporation's strategy.Al Maktoum International Airport will enjoy the… pic.twitter.com/oG973DGRYX— HH Sheikh Mohammed (@HHShkMohd) April 28, 2024 ఇక, ఈ ఎయిర్పోర్టు ఫ్లాగ్షిప్ క్యారియర్ ఎమిరేట్స్, లోబడ్జెట్ విమానయాన సంస్థ ఫ్లైదుబాయ్తో పాటు ప్రపంచాన్ని దుబాయ్కి, బయటికి కనెక్ట్ చేసే అన్ని ఎయిర్లైన్ భాగస్వాములకు కొత్త డెస్టినేషన్ కానుందని దుబాయ్ ప్రభుత్వ ఎయిర్లైన్ ఎమిరేట్స్ చైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్-మక్తూమ్ వెల్లడించారు. ఈ నిర్మాణం ప్రపంచ వేదికపై ప్రముఖ ఏవియేషన్ హబ్గా దుబాయ్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ తెలిపారు. -
బర్డ్ఫ్లూ భయం లేదు.. అలా చేసిన పాలు సేఫ్!
జంతువుల్లో ప్రాణాంతకమైన బర్డ్ఫ్లూ వైరస్ అమెరికాలో మనిషికి సోకడం భయాందోళన కలిగిస్తోంది. వైరస్ ఆనవాళ్లు మనుషులు తాగే ఆవు పాలలో కనిపించడంతో అందరూ భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు కీలక విషయం చెప్పారు.యూఎస్ స్టోర్లలో విక్రయిస్తున్న పాలు బర్డ్ ఫ్లూ నుండి సురక్షితమైనవని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఎందుకంటే ఈ పాలను పాశ్చరైజేషన్ చేస్తారని, పాశ్చరైజేషన్ వ్యాధిని ప్రభావవంతంగా చంపుతుందని పేర్కొన్నారు.అత్యంత వ్యాధికారక ఏవియన్ ఇన్ఫ్లుయంజా (HPAI) వ్యాప్తి దేశవ్యాప్తంగా పాడి పశువుల మందల ద్వారా వ్యాపించింది. తేలికపాటి లక్షణాలతో ఒక వ్యక్తికి సోకింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని పాల విక్రయ సంస్థల నుంచి నమూనాలను ఎఫ్డీఏ పరీక్షించింది. ఇందులో ప్రతి ఐదు శాంపిల్స్లో ఒక దాంట్లో వైరస్ ఆనవాళ్లు కనిపించాయని ఎఫ్డీఏ పేర్కొంది.అయితే పాశ్చరైజేషన్ ప్రక్రియ కారణంగా వైరస్ పాల ద్వారా ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం లేదని ఎఫ్డీఏ ప్రకటించింది. దీనిపై మరిన్ని పరీక్షలు అవసరమని పేర్కొంది. హెచ్పీఏఐని నిష్క్రియం చేయడంలో పాశ్చరైజేషన్ ప్రభావవంతంగా ఉంటుందిని ప్రాథమిక ఫలితాల్లో గుర్తించినట్లు ఎఫ్డీఏ వెల్లడించింది. ఇంతకుముందు బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు పచ్చి పాలలో కనుగొనడంతో ఆరోగ్య అధికారులు పచ్చి పాలను తాగొద్దని సూచించారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
పంజాబ్లో మరో లిస్ట్ ప్రకటించిన కాంగ్రెస్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement