పిడిగుద్దులతో చంపేశాడు | Sakshi
Sakshi News home page

పిడిగుద్దులతో చంపేశాడు

Published Mon, Aug 22 2016 2:35 AM

పిడిగుద్దులతో చంపేశాడు - Sakshi

షికాగో: టీవీ చూస్తుండగా గుక్కపట్టి ఏడుస్తోందని ఓ తండ్రి 4 నెలల కూతురిపై 22సార్లు పిడిగుద్దులు కురిపించాడు. తీవ్రగాయాలు కావడంతో ఆ పాప చనిపోయింది. అమెరికాలోని మిన్నియాపొలిస్ సిటీలో ఉండే కోరి మోరిస్(21)కు 4 నెలల కూతురు ఎమర్సిన్ ఉంది. పాప తల్లి ఉద్యోగి కావడంతో వారానికి 3, 4 రోజులు ఇంట్లో అతనే పాప బాగోగులు చూసుకుంటాడు.

ఈ నెల 13న తల్లి బయటకు వెళ్లినపుడు మోరిస్ టీవీ చూస్తుండగా ఎమర్సిన్ ఏడ్చింది. మోరిస్ పాప ముఖంపై 15 సార్లు, ఛాతిపై ఏడు సార్లు పిడిగుద్దులు గుద్దాడు. పోలీసులు మోరిస్‌ను అరెస్ట్ చేశారు.

Advertisement
Advertisement