మానవాళిని రక్షిస్తున్న ఐస్ పర్వతాలు | Sakshi
Sakshi News home page

మానవాళిని రక్షిస్తున్న ఐస్ పర్వతాలు

Published Fri, Jan 15 2016 5:03 AM

మానవాళిని రక్షిస్తున్న ఐస్ పర్వతాలు

ముంచుకొస్తున్న గ్లోబల్ వార్మింగ్ ముప్పు నుంచి మానవాళిని రక్షించడంలో మహాసముద్రాల్లోని ఐస్ పర్వతాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తాజాగా జరిపిన అధ్యయనంలో తేలింది. భూగోళం వేడెక్కడానికి ప్రధాన కారణమైన కర్బన ఉద్గారాలను ఇవి తమలో  నిక్షిప్తం చేసుకుంటున్నాయి. ఒక్కోటి సుమారు 18 కిలోమీటర్ల పొడవుండే ఈ ఐస్ పర్వతాలు నీటిలో తేలయాడుతూ తమ గమనంలో వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను శోషించుకుంటున్నాయని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్‌కి చెందిన పరిశోధకులు నిర్ధారించారు. భూగోళంపై ఉన్న మొత్తం కార్బన్‌లో సుమారు 20 శాతం హిందూమహాసముద్రంలోని ఐస్ పర్వతాలు గ్రహించి నిల్వ చేశాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ బిగ్గ్ వెల్లడించారు.

Advertisement
Advertisement