బ్లాక్ రిబ్బన్తో గూగుల్ నివాళి | Sakshi
Sakshi News home page

బ్లాక్ రిబ్బన్తో గూగుల్ నివాళి

Published Thu, Jul 30 2015 10:32 AM

బ్లాక్ రిబ్బన్తో గూగుల్ నివాళి

న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి పట్ల ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ నివాళులర్పించింది. దేశానికి ఎంతో సేవ చేసిన కలాం గొప్పతనాన్ని తెలిపేందుకు గూగుల్ వెబ్సైట్ హోమ్ పేజీలో బ్లాక్ రిబ్బన్ ను పెట్టి సంతాపం ప్రకటించింది. గురువారం కలాం అంత్యక్రియలు ఆయన సొంతగడ్డ తమిళనాడు రామేశ్వరంలోని పేక్కరుంబు గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నారు. షిల్లాంగ్ లోని ఏయిమ్స్ లో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ కుప్పకూలి అనంతరం ఆయన మృతిచెందిన విషయం విదితమే.

Advertisement

తప్పక చదవండి

Advertisement