కాబూల్: అఫ్ఘానిస్తాన్లో మరో దారుణం చోటు చేసుకుంది. మనసుకు నచ్చని పెళ్లిని వ్యతిరేకించిన ముస్లిం యువతిని రాళ్లతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అఫ్ఘాన్ మీడియా దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేయడంతో ఈ అమానుషం వెలుగు చూసింది. అఫ్ఘానిస్తాన్లోని రాక్ సహానా అనే ముస్లిం యువతికి పెద్దలు పెళ్లి కుదిర్చారు. ఈ పెళ్లి ఇష్టం లేని ఆమె తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. ప్రియుడితో కలిసి పారిపోయి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ప్రయత్నించింది. అదే ఆమె చేసిన నేరం. తాలిబన్లు ఆమెపై తమ ప్రతాపాన్ని చూపించారు. ప్రియుడితో కలిసి వెళుతుండగా పట్టుకుని అతి దారుణంగా రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ మొత్తం వైనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు మీడియాలో బయటపడింది.
దాదాపు 30 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో 20 ఏళ్ల వయసున్న రాక్ సహానా హృదయ విదారక రోదనలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అక్కడున్నవాళ్లంతా ఈ దృశ్యాలను చూస్తూ ఉండిపోయారు తప్ప ఏమీ చేయలేదు. ఆమెపై రాళ్లు విసురుతున్న శబ్దం, షహాదా అంటూ ఆమె పెట్టిన ఆర్తనాదాలు క్రమేపీ సన్నగిల్లడం ఈ వీడియోలో స్పష్టంగా ఉంది.
ఆ అమానుషం గతవారం ఘర్ రాష్ట్రంలోచోటుచేసుకుందని స్థానిక మహిళా గవర్నర్ సీమ జోయేంద్ర తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నా, ఘర్ ప్రాంతంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మతపెద్దలు, ఇతర సాయుధుల సమక్షంలో ఆ యువతిని రాళ్లతో కొట్టి చంపారని ఆమె తెలిపారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రేమపెళ్లి కోసం వెళ్తే.. రాళ్లతో కొట్టి చంపారు
Published Tue, Nov 3 2015 3:51 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement