విమానయానం.. భారత్లోనే అత్యంత చౌక | Sakshi
Sakshi News home page

విమానయానం.. భారత్లోనే అత్యంత చౌక

Published Fri, Sep 5 2014 8:54 PM

విమానయానం.. భారత్లోనే అత్యంత చౌక

సిడ్నీ: వంద రూపాయలకే విమాన టిక్కెట్, ప్రత్యేక ఆఫర్లు, తక్కువ మొత్తంతో విదేశీయానం.. ఇలాంటి వార్తలు ఈ మధ్య చదివుంటారు. ప్రపంచంలో అత్యంత చౌకగా విమానంలో ప్రయాణించే సదుపాయం భారత్లోనే ఉంది. ఆస్ట్రేలియా పత్రిక సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ చేసిన పరిశోధనలో ఈ విషయాన్ని తాజాగా స్పష్టం చేసింది.

భారత్ తర్వాత మలేసియా, దక్షిణాఫ్రికా దేశాల్లో చౌకగా విమానంలో ప్రయాణించవచ్చు.  కాగా ప్రపంచంలో విమానయానంలో అత్యంత ఖరీదైన దేశం ఫిన్లాండ్.  ఆ తర్వాతి స్థానాల్లో స్విట్జర్లాండ్, లిథూనియా, ఆస్ట్రియా, ఈస్టోనియా ఉన్నాయి.

Advertisement
Advertisement