న్యూయార్క్ : కేవలం కళ్లు మాత్రమే కనిపించేలాగ ముఖానికి నల్లటి ముసుగు. చేతిలో ఓ పదును తేలిన కత్తి.. చూసేందుకు ముసుగుదొంగలా కనిపించే ఆ వ్యక్తి ఉగ్రవాదుల్లోనే అతి క్రూరమైనవాడు. ఆదేశాలు అందుకున్నదే తడువుగా వీడియో కెమెరాకు పోజిస్తూ అతి దారుణంగా అమాయకుల పీకలను తెంపుతుంటాడు. అలా చేసే వ్యక్తిని 'జిహాదీ జాన్' అంటారు. ఇప్పుడు ఆ జిహాదీ జాన్ మారిపోయాడని సమాచారం. భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు సిద్ధార్థ ధర్ ఇప్పుడు జిహాదీ జాన్గా మారిపోయాడని తెలుస్తోంది. బ్రిటన్కు చెందిన అతడు ఇస్లాం మతంలోకి మారి అనంతరం ఐసిస్లో చేరడంతో అమెరికా తాజాగా అతడిని గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించింది.
ప్రపంచవ్యాప్త ఉగ్రవాదుల జాబితాలో సిద్ధార్థను చేర్చింది. ప్రస్తుతం అతడే ఐసిస్లో జిహాదీ జాన్గా ఉంటూ అమాయకులను అతి దారుణంగా గొంతుకోసి చంపుతున్నాడట. ఇతడి గురించి సంక్షిప్త వివరాలు ఓసారి పరిశీలిస్తే.. సిద్ధార్థ తొలుత ఓ బ్రిటన్ హిందువు. ఇస్లాం మతంలోకి మారాక అతడి పేరును అబు రుమాయ్సాగా మార్చుకున్నాడు. ప్రస్తుతం బ్రిటన్ టెర్రరిస్టు ఆర్గనైజేషన్ అల్ ముహాజిరౌన్ అనే విభాగానికి నడిపిస్తున్న వారిలో కీలకంగా పనిచేస్తున్నాడు. బ్రిటన్లో ఓ కేసులో అరెస్టయి బెయిల్పై విడుదలైన అనంతరం సిరియాకు తన భార్య, పిల్లలతో కలిసి పారిపోయి ఐసిస్లో చేరాడు. 2015లో డ్రోన్ దాడిలో మహ్మద్ ఎమ్వాజీ(జిహాదీ జాన్) హతమవడంతో అతడి స్థానంలో సీనియర్ కమాండర్గా కొనసాగుతున్నాడు. 2016 నుంచి బందీలుగా ఉగ్రవాదులు పట్టుకున్న వారందరిని గొంతు కోసి చంపిన వ్యక్తి ఇతడే అని అమెరికా తాజాగా గుర్తించింది.
2015 నుంచి గొంతులు కోస్తున్నాడు..
Published Wed, Jan 24 2018 3:41 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement