అమెరికాలో భారత విద్యార్థి మృతి | Sakshi
Sakshi News home page

అమెరికాలో భారత విద్యార్థి మృతి

Published Sun, Mar 15 2015 2:01 AM

అమెరికాలో భారత విద్యార్థి మృతి

లాస్ ఏంజెలిస్: అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో బుధవారం జరిగిన ఓ ప్రమాదంలో భారత విద్యార్థి రిషబ్ చౌదురి (22) మృతి చెందాడు. అస్సాంలోని గువాహటికి చెందిన చౌదురి ఓహియోలోని వూస్టర్ కాలేజీలో చదువుకుంటున్నాడు. స్నేహితులతో కలసి బుధవారం అరిజోనా ప్రాంతంలోని కొండ ప్రాంతానికి వెళ్లాడు. మిత్రుల బృందం నుంచి దూరంగా వెళ్లిన చౌదురి ఆ ప్రాంతం నుంచి దాదాపు వంద అడుగుల లోయలో పడి మృతి చెందాడు.

స్నేహితులు అతడి కోసం వెతకగా లోయలో పడి మృతిచెందినట్లు గుర్తించారు. చౌదురి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షల కోసం పంపామని, ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement