డమాస్కస్: పాపం పుణ్యం...ప్రపంచ మార్గం ఏమీ తెలియని పిల్లలు, ఐదారేళ్ల పాపలు...మన మధ్యనే బాంబులై పేలనున్నారు. మనుషుల పీకలను నిర్ధాక్షిణ్యంగా తెగకోయనున్నారు. గుండెల్లోకి తుపాకీ గుళ్లను గురిచూసి పేల్చనున్నారు. ఈ భయంకర పరిణామం కలియుగ అంతంలో కాదు, కలికాలంలోనే జరగనున్నది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ ప్రాబల్యంలోని ఉత్తర ఇరాక్, తూర్పు సిరియా ప్రాంతాల్లో పసి పాపల బుర్రల్లో విషాన్ని కూరుతున్నారు. వారికి ఏకే-47 సహా వివిధ రకాల ఆయుధాలను ఉపయోగించడంలో, మర మనుషులుగా నిర్ధాక్షిణ్యంగా మనుషులను చంపడంలో కఠిన శిక్షణ ఇస్తున్నారు. 19 ఏళ్ల ఇజ్రాయెలీ అరబ్ను పట్టుమని పదేళ్లు కూడా లేని ఓ బాలుడు తుపాకీతో కాల్చి చంపుతున్న వీడియో దృశ్యాలను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇటీవల విడుదల చేయడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తూర్పు సిరియా ప్రాంతంలో గుర్తుతెలియని చోట పిల్లలకు శిక్షణ ఇస్తున్న వీడియోలను కూడా ఉగ్రవాదులు విడుదల చేశారు. వాటిలో తాము నరికేసిన తలలను పిల్లల చేతికిచ్చి మోయించడం, మానవుల తలలను ఎలా తెగకొట్టాలో బొమ్మలతో ప్రాక్టీస్ చేయించడం లాంటి దారుణమైన దృశ్యాలున్నాయి. ఆ పిల్లల్లో ముక్కుపచ్చలారని ఐదేళ్ల పాపలు కూడా ఉండడం భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది.
‘ఎలాంటి బాహ్య ప్రపంచ ప్రభావానికి అవకాశంలేని ఉత్తర ఇరాక్, తూర్పు సిరియా ప్రాంతాల్లో బాలలకు ఇలాంటి శిక్షణ ఇవ్వడం. గుండెలను పిండేసే బాధను కలిగిస్తోంది. దీన్నిబట్టి టెర్రరిజంపై పోరు అనతికాలంలో ముగిసేది కాదని, సుదీర్ఘకాలం కొనసాగుతందని అర్థం అవుతోంది’ అని ఉగ్రవాద నిరోధక సంస్థ ‘కిల్లియమ్ ఫౌండేషన్’ నిపుణుడు చార్లీ వింటర్ వ్యాఖ్యానించారు. ‘ ఉగ్రవాదులు ఎలా పిల్లలను రక్త పిపాసులుగా మారుస్తున్నారో అంతుపట్టడం లేదు. బహుశా ఆ పిల్లలకు మరో అవకాశం లేదేమో’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఐఎస్ఐఎస్ నియామక ప్రక్రియ గురించి తెలుసుకునేందుకు ప్రపంచ మానవ హక్కుల గురించి పోరాడుతున్న ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ ఉగ్రవాదుల శిక్షణలో చేరిన నలుగురు యువకులను ఇంటర్వ్యూ చేసింది.
వారిలో అమర్ అనే యువకుడు ‘నాకిప్పుడు 17 ఏళ్లు. గతేడాదే నేను ఇందులో చేరాను. అల్లా పేరిట అవసరమైతే మానవ బాంబులా పేలిపోవడానికి కూడా సిద్ధమంటూ సంతకం కూడా చేశాను. నన్ను రహస్యంగా ఏమీ చేర్చుకోలేదు. బహిరంగాగానే వచ్చి చేరుతావా అంటూ నన్నడిగారు. వారి యూనిఫారాలు, ఆయుధాలు చూసి ఆకర్షితుడనై చేరాను. ఇప్పుడు నాకు జీతం కూడా ఇస్తున్నారు. వారు చెప్పినట్టు చేయడం మినహా నాకు మరో ఆలోచన లేదు’ అని చెప్పాడు.
బాంబులై పేలనున్న బాలలు!
Published Thu, Mar 12 2015 8:13 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఏపీ ఎన్నికలపై సీఎం జగన్ ట్వీట్
May 15th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థుల భవితవ్యం:
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి హేయమైన చర్య
విజయం వైఎస్సార్ సీపీదే
20న ఎడ్ల బండలాగుడు పోటీలు
No Headline
ఓటేసిన 15,89,412 మంది
Hyderabad: కాస్త పెరిగినా చివరి స్థానమే..
జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement