భారత్‌కు అమెరికా రాయబారిగా జస్టర్‌! | Sakshi
Sakshi News home page

భారత్‌కు అమెరికా రాయబారిగా జస్టర్‌!

Published Thu, Jun 22 2017 2:33 AM

భారత్‌కు అమెరికా రాయబారిగా జస్టర్‌! - Sakshi

వాషింగ్టన్‌: భారత్‌కు అమెరికా తదుపరి రాయబారిగా కెన్నెత్‌ జస్టర్‌ నియమితులు కావడానికి రంగం సిద్ధమైంది. 62 ఏళ్ల జస్టర్‌ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో ఉప సహాయకుడిగా ఉన్నారు. అమెరికా జాతీయ ఆర్థిక మండలికి ఉప డైరెక్టర్‌ కూడా జస్టరే. భారత్‌కు అమెరికా రాయబారిగా జస్టర్‌ను ఇంకా నామినేట్‌ చేయాల్సి ఉంది.

అనంతరం సెనేట్‌ ఆమోదం లభిస్తే రిచర్డ్‌ వర్మ (ప్రస్తుత అమెరికా రాయబారి) స్థానంలో జస్టర్‌ బాధ్యతలు చేపడతారు. ఈ నెల 26న భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను శ్వేతసౌధంలో కలవనుండటం తెలిసిందే.

Advertisement
Advertisement