సెయింట్ మార్టిన్ :
సముద్రతీరంలో సేదతీరుతూ, దగ్గరి నుంచి విమానాన్ని చూస్తూ జెట్ ఇంజిన్ బ్లాస్ట్ అనుభూతిని ఆస్వాధించాలని వేల కిలో మీటర్లు ప్రయాణించి వచ్చిన ఓ పర్యాటకురాలు మృతిచెందింది. న్యూజిలాండ్కు చెందిన ఓ 57 ఏళ్ల పర్యాటకురాలు సెయింట్ మార్టిన్లోని డచ్ కరేబియన్ దీవిలో మృతిచెందారు. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో కంచెను పట్టుకొని విమానం నుంచి వచ్చే శబ్ధం, గాలులను దగ్గర నుంచి చూస్తూ థ్రిల్ ఫీలవ్వాలనుకుంది. అయితే విమానం నుంచి ఒక్కసారిగా పెద్ద మొత్తంలో గాలి ఓ పేలుడులా బయటకు రావడంతో సదరు మహిళ ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరైంది. జెట్ ఇంజిన్ బ్లాస్ట్ దాటికి గోడకు ఢీకొని కిందపడిపోయింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై సెయింట్ మార్టిన్ దీవి టూరిజం డైరెక్టర్ రొనాల్డో బ్రిసన్ సంతాపం వ్యక్తం చేశారు.
ప్రిన్సెస్ జూలియానా అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి సమీపంలోనే బీచ్ ఉంది. విమానాలు టేకాఫ్, ల్యాండ్ అయ్యే సమయాల్లో అటువైపు వెల్లకూడదు అంటూ హెచ్చరిక బోర్డులు ఉన్నా టూరిస్టులు వాటిని పట్టించుకోవడం లేదని అధికారులు తెలిపారు. థ్రిల్ కోసం ఇక్కడకు వస్తుంటారని ప్రమాదవశాత్తూ ఓ మహిళ మృతిచెందడం బాధకరమన్నారు. జెట్ బ్లాస్ట్ వల్ల గత కొన్నేళ్లుగా పలువురు గాయాలపాలైనా, ఓ వ్యక్తి ప్రాణాలు పోవడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు.
విమానం గాల్లో ఉండగానే దానికి అతి సమీపం నుంచి ఫోటోలు, వీడియోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పర్యాటకులు భావిస్తుంటారని స్థానికులు తెలిపారు.
జెట్ ఇంజిన్ బ్లాస్ట్.. బీచ్లో మహిళ మృతి
Published Fri, Jul 14 2017 10:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement