శ్రీలంక చేరుకున్న ప్రధాని మోదీ | Sakshi
Sakshi News home page

శ్రీలంక చేరుకున్న ప్రధాని మోదీ

Published Fri, Mar 13 2015 11:07 AM

Modi arrives in Sri Lanka

కొలంబో: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం  ఉదయం శ్రీలంక చేరుకున్నారు. ప్రధాని మూడు దేశాల పర్యటనలో  చివరిది  శ్రీలంక. దాదాపు 28  సంవత్సరాల తరువాత  భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే ప్రధమం. శ్రీలంక ప్రధాని రాణిల్ విక్రమ్ సింఘే, విదేశీ వ్యవహారాల ప్రతినిధి సయద్ అక్బరుద్దీన్ మోదీకి ఘన స్వాగతం పలికారు.   ప్రధానిమోదీ , శ్రీలంక అధ్యక్షుడు  సిరిసేనతో చర్చలు జరుపనున్నారు. మోదీ  పర్యటనకు ఆ దేశ పత్రికలు  ప్రముఖంగా పేర్కొన్నట్టు తెలుస్తోంది.
 

Advertisement
Advertisement