బీజింగ్: ఉత్తర కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియా మరో అణ్వస్త్ర ప్రయోగానికి సిద్ధమైతే సరిహద్దు ప్రాంతంలో వేలాది మంది అమాయక ప్రజలు మరణిస్తారని చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది. నేరుగా అణ్వస్త్ర ప్రయోగం వల్ల కాకుండా ఆ ప్రయోగం కారణంగా కొరియా, చైనా సరిహద్దులోని మౌంట్ పేంక్తూ అగ్ని పర్వతం బద్దలవడం వల్ల వేలాది మంది ప్రజలు మరణిస్తారని రాండ్ కార్పొరేషన్ను చెందిన డిఫెన్స్ విశ్లేషకులు బ్రూస్ బెన్నెట్ తెలిపారు. ఈ అగ్ని పర్వతాన్ని చైనా భాషలో చాంగ్బైషాన్ అని పిలుస్తారు.
ఉత్తర కొరియా అణు పరీక్షలు నిర్వహించే పుంగి–రీ ప్రాంతానికి కేవలం 130 కిలోమీటర్ల దూరంలో ఈ అగ్ని పర్వతం ఉంది. దానికి వంద కిలోమీటర్ల పరిధిలో ఇరు దేశాలకు చెందిన దాదాపు 16 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. అగ్ని ప్రమాదం బద్ధలయితే ఇరు ప్రజల ప్రాణాలకు ముప్పని చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2002 నుంచి 2005 మధ్య ఈ అగ్ని ప్రమాదంలో శిలాద్రవం పెరిగినట్లు ప్రకంపనల ద్వారా తెలుస్తోందని చైనా నిపుణులు పేర్కొంటున్నారు.
ఉత్తర కొరియా చాలా కాలం నుంచి ప్రపంచ దేశాలను దూరంగా ఉంచడం వల్ల అగ్ని పర్వతం నుంచి ముప్పు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో కచ్చితంగా చెప్పలేమని చైనా నిపుణులు చెబుతున్నారు. కొరియా ప్రాచీన చరిత్రపరంగా ఈ అగ్ని పర్వత ప్రాంతం కొరియాకు ఎంతో ప్రాధాన్యమైనది. కొరియా తొలి రాజ్యాన్ని స్థాపించిన డంగూన్ రాజు పుట్టిన స్థలం అదని వారి చరిత్ర తెలియజేస్తోంది. అందుకే మంచుతో కప్పబడిన మౌంట్ పేంక్తూ ప్రాంతాన్ని కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ 2015, ఏప్రిల్ 20వ తేదీన సందర్శించిన ఫొటోను వారి అధికార మీడియా విడుదల చేసింది.
కొరియా ఇటీవల నిర్వహించినట్లుగా పది కిలోటన్నుల అణ్వస్త్రాన్ని ప్రయోగించినా అగ్నిపర్వతం బద్దలయ్యే అవకాశం ఉందని, యాభై నుంచి వంద కిలోటన్నుల అణ్వస్త్రాన్ని ప్రయోగించే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రమాదం తీవ్ర స్థాయిలోనే ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
అణ్వస్త్రంతో అగ్నిపర్వతం బద్దలయితే....
Published Fri, May 5 2017 5:49 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement