లాహోర్: వెంటనే తమ దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందిగా టర్కీకి చెందిన 100మంది టీచర్లను పాకిస్థాన్ ప్రభుత్వం ఆదేశించింది. నవంబర్ 20నాటికి కుటుంబ సభ్యులతో సహా ఖాళీ చేసి ఏ ఒక్కరు ఉండకుండా వెళ్లిపోవాలని చెప్పింది. టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ రెండు రోజులపర్యటనలో భాగంగా నేడు ఇస్లామాబాద్ వస్తుండగా పాక్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అంతర్గత వ్యవహారాల మంత్రివర్గ సమాచారం ప్రకారం.. మూడు రోజుల్లోగా పాక్ ను విడిచి వెళ్లాలని టర్కీ టీచర్లకు చెప్పారంట.
మొత్తం 108మంది టీచర్లు ఇక్కడ విద్యను బోధిస్తున్నారని, అయితే, వారి వీసాల గడువు పూర్తవడం, వాటిని మరింత పొడిగించేందుకు నిరాకరించడంతో వారిని పంపిస్తున్నామని పాక్ అధికారులు చెప్పారు. వాస్తవానికి ఈ పాఠశాలను నడుపుతున్న వ్యక్తి అమెరికాలోని పాక్ సంతతికి చెందిన ఫెతుల్లా గులెన్ అనే ముస్లిం మతాచార్యుడు. అయితే, ఆయనను టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ గతంలో తీవ్రంగా విమర్శించారు.
దీన్ని మనసులో పెట్టుకొని వారి వీసా గడువు పెంచనీయకుండా ఫెతుల్లా పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి చేసి వారిని వెంటనే పంపించేందుకు ఒప్పించినట్లు తెలిసింది. పాక్ నిర్ణయంపై పాక్-టర్కీ స్కూళ్లు ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఒత్తిళ్లకు తలొగ్గే పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించాయి. ఎర్డోగన్ పర్యటన తర్వాత పాక్ నిర్ణయంలో మార్పు వస్తుందేమో చూడాలి.
'ఇక మూడురోజుల్లో మా దేశం విడిచి పోండి'
Published Wed, Nov 16 2016 9:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement