లఖ్వీ బెయిల్ ను సవాల్ చేసిన పాక్ | Sakshi
Sakshi News home page

లఖ్వీ బెయిల్ ను సవాల్ చేసిన పాక్

Published Thu, Jan 1 2015 1:07 PM

లఖ్వీ బెయిల్ ను సవాల్ చేసిన పాక్ - Sakshi

ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా కమాండర్  జకీమర్ రెహ్మాన్ లఖ్వీ కి ఇస్లామాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్నిసవాల్ చేస్తూ పాకిస్థాన్ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  ముందస్తు నిర్బంధంలో ఉన్న లఖ్వీని విడుదల చేయాల్సిందిగా ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. 

దీంతో అతను డిసెంబర్ 18 వ తేదీన బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే దీన్ని సవాల్ చేసిన పాక్ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదిలా ఉండగా మరోకేసులో లఖ్వీని మంగళవారం పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement
Advertisement