ఇస్లామాబాద్: అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడికి పాకిస్తాన్ తలొగ్గింది. పాక్లో ని ఉగ్రవాద గ్రూపులపై ఎట్టకేలకు నిషేధం విధించింది. 2008లో ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్-ఉద్-దవా(జేయూడీ), హక్కానీ నెట్వర్క్లతో సహా పలు ఉగ్రవాద సంస్థలపై వేటు వేసింది. సయీద్ విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. పలు ఉగ్రవాద గ్రూపులకు వెన్నుదన్నుగా నిలుస్తూ, కొన్ని గ్రూపులపై మాత్రమే చర్యలు తీసుకుంటున్న పాక్ తీరుపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. నిషేధాన్ని ధృవీకరిస్తూ పాక్ విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. పలు ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించినట్లు వెల్లడిస్తూనే.. ఐరాస నిర్దేశం మేరకే ఈ చర్యలు తీసుకున్నామని, ఈ విషయంలో అమెరికా సహా ఎవరి ఒత్తిడి లేదని పేర్కొంది. ఉగ్రవాద సంస్థల బ్యాంకు లావాదేవీలను నిలిపివేస్తున్నట్లు కూడా రేడి యో పాకిస్తాన్ వెల్లడించింది. భారత గణతంత్ర దినోత్సవాల్లో ఒబామా పాల్గొంటున్న నేపథ్యంలో పాక్ చర్యలు చేపట్టడం గమనార్హం.
నిషేధిత జాబితాలో పలు సంస్థలు
నిషేధిత సంస్థల జాబితాలో జేయూడీతో పాటు ఫలా-ఇ-ఇన్సానియత్ ఫౌండేషన్(ఎఫ్ఐఎఫ్), హర్కతుల్ జిహాద్ ఇస్లామీ, హర్కతుల్ ముజాహిదీన్, ఉమ్మా తమీర్-ఇ-నౌ వంటి సంస్థలు ఉన్నాయి. హఫీజ్ సయీద్ను పట్టుకోడానికి అమెరికా ఇప్పటికే దాదాపు రూ. 60 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ప్రస్తుతం పాక్లో స్వేచ్ఛగా తిరుగుతున్న సయీద్.. తరచూ బహిరంగ సభల్లో పాల్గొంటూ భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉగ్ర కార్యకలాపాలు ఆపం: జేయూడీ.. తమ సంస్థపై పాక్ నిషేధం విధించినా సరే తమ కార్యకలాపాలను ఆపేదిలేదని ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. గతంలోనే తమ సంస్థ మతబోధనలు, కార్యకలాపాలకు అనుకూలంగా సుప్రీం కోర్టు, లాహోర్ హైకోర్టులు తీర్పులు చెప్పాయని జేడీయూ అధికార ప్రతినిధి యాహా ముజాహిదీన్ గురువారం వ్యాఖ్యానించారు.
జమాత్పై పాక్ నిషేధం
Published Fri, Jan 23 2015 1:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నోటుతో ఓటుకు ఎర
ఓటింగ్ శాతం పెంపే లక్ష్యం
పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోండి
వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే స్వర్ణయుగం
No Headline
కందుకూరులో.. ఇక దూకుడే
సీఎం సవాల్ను స్వీకరించే దమ్ముందా చంద్రబాబూ?
బుర్రా సమక్షంలో టీడీపీ నాయకుల చేరిక
గెలిపించండి.. అండగా ఉంటా
నాడు – నేడుతో ప్రభుత్వ బడులకు కొత్త కళ
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement