పాకిస్థాన్ లో వివాదాస్పద పోస్టర్లు..! | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ లో వివాదాస్పద పోస్టర్లు..!

Published Mon, Oct 10 2016 4:48 PM

పాకిస్థాన్ లో వివాదాస్పద పోస్టర్లు..!

పాకిస్థాన్ కరాచీలో కనిపించిన పోస్టర్లు.. ఉద్రిక్తతను రేకెత్తించాయి. హిజ్రాలు కనిపిస్తే చంపేయమంటూ పోస్టర్లపై రాసి ఉండటం వివాదాస్పదంగా మారింది. పాకిస్థాన్లో బలహీనమైన చట్టాలు అమల్లో ఉండటం వల్లనే వారంతా ఇక్కడ హాయిగా బతకగల్గుతున్నారని, అదే సౌదీ అరేబియాలో అయితే వారిని నరికేస్తారంటూ పోస్టర్లలో వివరించడం స్థానికంగా కలకలం సృష్టించింది.

కచాచీలో రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతంలో వివాదాస్పద పోస్టర్లు భారీ ఎత్తున అతికించడం అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. హిజ్రాలు అత్యధికంగా తిరుగుతూ, బిక్షాటన చేసుకుంటూ ఉండే ఈ ప్రాంతాన్నే టార్గెట్ చేసి, పోస్టర్లు అతికించడం హిజ్రాలను తీవ్రంగా భయపెడుతోంది. దీంతో వారంతా ఆ ప్రాంతానికి వెళ్ళడమే మానుకున్నారు. అయితే పోస్టర్లు ఎవరు అంటించారు, ఏ సందర్భంలో అంటించారన్న వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్తున్నారు. విషయంపై స్థానికులను ఆరా తీస్తున్నారు.

పోస్టర్ల సంగతి ఎలా ఉన్నా తమకు హిజ్రాల ఇబ్బందులు తగ్గాయని స్థానిక దుకాణ దారులు ఈ సందర్భంగా చెప్పారు. డబ్బులకోసం హిజ్రాలు స్థానికులను, జనాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడతారని, ఇదే అదనుగా తీసుకునే కొందరు పురుషులు కూడా  హిజ్రాల వేషంలో మహిళలను తాకేందుకు ప్రయత్నిస్తుంటారని వారు ఆరోపిస్తున్నారు. అయితే సమస్యను ఎదుర్కొనేందుకు దుకాణ యజమానులే ఇటువంటి పోస్టర్లు అతికించి ఉంటారా అన్నకోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్టర్ల ప్రచారంలో కర్తలు ఎవరని తెలియకపోయినా.. ప్రాణభయం ఉన్న హిజ్రాలు తమను ఆశ్రయించి రక్షణ కోరవచ్చని పోలీసు సీనియర్ అధికారులు చెప్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement