న్యూయార్క్ః చక్కెర పానీయాలు, కూల్ డ్రింకులు, పంచదార సోడాల్లో కొద్దిగా నీళ్ళు కలిపి తాగడం వల్ల శరీర బరువు తగ్గించుకోవచ్చనంటున్నాయి తాజా అధ్యయనాలు. తీవ్రమైన, దాహాన్ని తీర్చుకునేందుకు మంచినీళ్ళకు బదులుగా చక్కెర పానీయాలను ఆశ్రయించేవారు వాటిలో కొద్దిగా నీటిని కలిపి తాగడంవల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు.
సోడాలు, ఎనర్జీ డ్రింకులు, స్వీట్ కాఫీలు శారీరక బరువును పెంచుతాయని, ఊబకాయానికి కారణమౌతాయని అలాగే వాటితో టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు పరిశోధకులు. రోజువారీ తీసుకునే పానీయాల్లో ఒక్కటైనా ఆరోగ్యానికి ఉపయోగపడేదిగా ఉండాలని అమెరికా బ్లాక్స్ బర్గ్, వర్జీనియా టెక్ యూనివర్శిటీ పరిశోధకులు కియా జె డఫీ తెలిపారు. 8 ఔన్సుల శీతల పానీయంలో 8 ఔన్సుల నీటిని జోడించి తాగడంవల్ల కేలరీలను తగ్గించడంతోపాటు, శరీరంపై ఊబకాయం ప్రభావం తగ్గుతుందని చెప్తున్నారు. రోజువారీ ఒకసారి సేవించే శీతలపానీయంలో నీటిని కలిపి తాగడం వల్ల పానీయాలనుంచి వచ్చే సుమారు 11నుంచి 17 శాతం కేలరీలు తగ్గుతాయని తమ అధ్యయనాల్లో గుర్తించినట్లు డఫీ తెలిపారు.
ప్రతిరోజూ అధికమొత్తంలో శీతల పానీయాలు సేవించేవారు కూడా నీటిని జోడించి సేవించడంవల్ల శరీరానికి రోజువారీ అందే కేలరీల్లో 25 శాతం తగ్గి లాభదాయకమైన ప్రయోజనాలు ఉన్నట్లు గుర్తించామని పరిశోధకులు న్యూట్రియంట్ జర్నల్ లో నివేదించారు. అధిక కేలరీలు కలిగిన ఆహారం కన్నా.. తక్కువ కేలరీలు ఉండే నీరు, చక్కెర లేని కాఫీ, టీ, కూరగాయలు, తృణ ధాన్యాలు, చేపలు, పౌల్ట్రీ సంబంధ పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని, డైట్ డ్రింకులు కూడా శీతల పానీయాలకు ప్రత్యామ్నాయాలుగా వాడొచ్చని డఫీ వివరించారు.
కూల్ డ్రింకులకు నీటిని జోడిస్తే...
Published Mon, Aug 15 2016 1:20 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement