న్యూఢిల్లీ: రష్యా-భారత్ బంధానికి బీటలు పారనున్నాయా? భవిష్యత్తులో రష్యాను ఇక భారత్ నమ్మలేని పరిస్థితి తలెత్తనుందా? ఈ రెండు దేశాలు పరస్పరం విరుద్ధంగా వ్యవహరించనున్నాయా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం భారత్కు బద్ధశత్రువులైన పాకిస్థాన్, చైనాలకు ఆ దేశం అండగా నిలవడమే. అవును.. పరోక్షంగా పాక్కు రష్యా మద్దతిచ్చింది. నెల రోజుల కిందట పాక్ వ్యతిరేకంగా మాట్లాడిన ఆ దేశం ఇప్పుడు బాహాటంగా మద్దతు తెలుపుతోంది. దీంతో అంతర్జాతీయ సమాజం ముందు ఉగ్రవాదానికి ఊతమందిస్తున్న పాక్ను ఒంటరి చేయాలన్న భారత్ వ్యూహాలు బెడిసికొట్టేలా కనిపిస్తున్నాయి. అసలింతకి దశాబ్దాలుగా ఉన్న రష్యా-భారత్ బంధాలను కదిలించి ఆ సమస్య ఏమిటని అనుకుంటున్నారా..!
పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం చైనా-పాక్ దేశాల మధ్య చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ) ఏర్పాటు జరిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, ఇది పాక్ లోని గ్వాదర్ నుంచి బలోచిస్తాన్ ప్రావిన్స్ గుండా చైనాలోని జిన్ జియాంగ్ వరకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కారిడార్ గిల్గిత్-బాల్టిస్తాన్ నుంచి వెళ్లనుందిజ. ఇది పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని భూభాగం. ఈ భూభాగం తమదేనని భారత్ ఇప్పటికీ చెప్పుకుంటోంది. ఈ విషయంపై భారత్ ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో సమావేశమైన సందర్భంలో ప్రస్తావించారు. వివాదంలో ఉన్న భూభాగం విషయంలో ఉమ్మడిగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని చెప్పారు. అలాంటి చర్య సరికాదని కూడా గుర్తు చేశారు.
అయినప్పటికీ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టును ఆపేస్తామని ఇప్పటి వరకు ఎలాంటి రాకపోగా తాజాగా తెరమీదకు రష్యా వచ్చింది. గత నెలలోనే సీపీఈసీ విషయంలో కలగజేసుకోని భాగస్వామ్యం అయ్యేందుకు రష్యా తహతహలాడుతోందంటూ పాక్ మీడియా వార్తలు వెలువరించగా వాటిని ఆ దేశం ఖండించింది. కానీ తాజాగా ఏకంగా పాక్కు రష్యా తరుపున రాయబారిగా వ్యవహరిస్తున్న అలెక్సీ వై దేదోవ్ మాత్రం భారత్ షాక్ గురయ్యే ప్రకటన చేశాడు.
సీపీఈసీకి తాము మద్దతిస్తున్నామని, పాక్ ఆర్థిక వ్యవస్థకు ఆ ప్రాజెక్టు చాలా అవసరం అని పేర్కొన్నారు. అంతే కాకుండా సీపీఈసీకు తమ యురేషియన్ ఎకనామిక్ యూనియన్ ప్రాజెక్టుతో సంబంధం కలుపుదామనుకుంటున్నామని ప్రకటించారు. దీనిపై భారత వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు బ్రహ్మ చెల్లానీ స్పందిస్తూ మాస్కో చేస్తున్న గందరగోళ ప్రకటనలతో భారత్-రష్యాల బంధం బలహీనమవుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. భారత్ ఇక రష్యాను నమ్మదగిన స్నేహితుడిగా ఎక్కువకాలం గుర్తించలేకపోవచ్చేమోనని అన్నారు.
భారత్-రష్యా బంధం బద్దలవనుందా?
Published Mon, Dec 19 2016 8:44 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement