అసూయతో కోసి పారేశాడు | Sakshi
Sakshi News home page

అసూయతో కోసి పారేశాడు

Published Fri, Jun 3 2016 5:50 PM

అసూయతో కోసి పారేశాడు - Sakshi

మాస్కో: ఇదొక జుగుప్సాకరమైన సంఘటన. తాగిన మత్తులో ఏం చేస్తున్నామో అనే విషయం కూడా మర్చిపోయిన ఉదంతం. రష్యాలో ఇద్దరు పురుషులు తాగిన మైకంలో ఆడిన వీధి భాగోతం. మత్తులో ఉన్న ఆ ఇద్దరు మర్మాంగాల విషయంలో పోటీ పెట్టుకున్నారు. అనంతరం ఓడిపోయిన వ్యక్తి అసూయతో గెలిచిన వ్యక్తి మర్మాంగాన్ని గొడ్డలితో నరికేశాడు. ఈ సంఘటన చూసిన అక్కడి వారంతా ఒక్కసారిగా బిత్తర పోయారు. చేతిలో రక్తపు మరకలు, గొడ్డలితో తిరుగుతున్న ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

మాస్కోకు సమీపంలోని ఓ గ్రామంలో ఓ 52 ఏళ్ల వ్యక్తి, 47 ఏళ్ల వ్యక్తి తాగుడుకు కూర్చున్నారు. కొంత తాగాక విశృంఖలంగా ఆలోచించారు. వినడానికే ఇబ్బంది కలిగించేలా వింతపోటీ పెట్టుకున్నారు. ఈ పోటీలో 47 ఏళ్ల వ్యక్తి గెలవడంతో 52 ఏళ్ల వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోయాడు. పక్కనే ఉన్న గొడ్డలితో 47 ఏళ్ల వ్యక్తిపై బలంగా కొట్టాడు. అనంతరం అతడిని కొంతదూరం ఈడ్చుకుంటూ వెళ్లి పురుషాంగాన్ని నరికేశాడు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు రెండు రోజులుగా ఆ ఇద్దరు వ్యక్తులు పూర్తి మద్యంలో మునిగిపోయి ఉండటం వల్ల ఈ తగువుకు దారి తీసిందని చెబుతున్నారు.

Advertisement
Advertisement