సియోల్: అధ్యక్ష పదవిని కోల్పోయిన దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గుయాన్ హై కోర్టు మెట్లెక్కారు. విషాదవదనంతో, భయకంపితురాలై, పాలిపోయిన ముఖంతో కనీసం పలకరించినవారితో కూడా ఒక్కమాట మాట్లాడకుండా ఆమె కోర్టుకు హాజరయ్యారు. అవినీతి ఆరోపణలకు సంబంధించి పార్క్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని విచారిస్తున్న కమిటీ ఆమెను అరెస్టు చేయాలని, బయటే ఉంటే ఆమెపై నమోదైన కేసును ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని, సాక్షులను ప్రభావితం చేస్తారని ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
దీంతో ఆమెను మాములుగా ఎప్పుడంటే అప్పుడు పిలిచి విచారణ చేయాలా లేక పోలీసుల కస్టడీకి అప్పగించి విచారణ చేయించాలా అనే విషయాన్ని తేల్చేందుకు సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ కోర్టుకు పిలిపించారు. ఈ నేపథ్యంలో ఆమె గురువారం ఉదయం కోర్టుకు హాజరయ్యారు. పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకోవడంతోపాటు, ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం బయటకు చేరవేశారని, అధికారం సహాయంతో కుంభకోణాలకు దిగారని, రహస్యంగా పనులు చక్కబెట్టుకొనే ప్రయత్నాలు చేశారని పలు రకాల ఆరోపణలు వచ్చాయి.
దీంతో ఆమె పదవి నుంచి దిగిపోవాల్సిందేనంటూ పెద్ద మొత్తంలో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేయడంతో ఉన్నత స్థాయి కోర్టు ఆదేశాల మేరకు ఆమె పదవిని కోల్పోయారు. ఈ కేసును విచారిస్తున్న కమిటీ దాదాపు 1,20,000 పేజీల పత్రాలను పార్క్కు కేసుకు సంబంధించి సెంట్రల్ జిల్లా కోర్టుకు అప్పగించింది. ఆమెను అరెస్టు చేస్తారా, కేవలం ఇంటివద్ద ఉంచి అవసరం అయినప్పుడు విచారణకు పిలిపిస్తారా అనే విషయం నేడు తేలే అవకాశం ఉంది.
విషాదంతో కోర్టు బోనులో మాజీ అధ్యక్షురాలు
Published Thu, Mar 30 2017 8:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement