ఏకే 47లతో వచ్చి.. యువరాజును దోచేశారు! | Sakshi
Sakshi News home page

ఏకే 47లతో వచ్చి.. యువరాజును దోచేశారు!

Published Tue, Aug 19 2014 12:36 PM

Saudi prince's convoy in Paris attacked by gunmen

పారిస్‌లో సౌదీ యువరాజు కేన్వాయ్‌ను అడ్డుకున్న దుండగులు.. 3.35 లక్షల డాలర్ల (దాదాపు రూ. 2 కోట్లు)ను దోపిడీ చేసి పారిపోయారు.  సౌదీ యువరాజు పారిస్‌లోని సౌదీ ఎంబసీ నుంచి విమానాశ్రయానికి వెళ్తుండగా.. ఆయన వాహనశ్రేణిని ఏకే 47 ఆయుధాలు కలిగిన దుండగులు అడ్డుకుని దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.

డబ్బులతో పాటు కొన్ని రహస్య డాక్యుమెంట్లు కూడా దోపిడీకి గురయ్యారని భావిస్తున్నారు. ఇది చాలా అసాధారణ దాడి అని, దుండగులు పక్కా సమాచారంతో, అరుదైన పద్దతిలో దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. దాడిలో ఎవరూ గాయపడలేదని, ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు.
 
 

Advertisement
Advertisement