మహిళలతో కిమ్‌ ఉన్‌ హత్య చేయించాడా? | Sakshi
Sakshi News home page

మహిళలతో కిమ్‌ ఉన్‌ హత్య చేయించాడా?

Published Thu, Feb 16 2017 11:30 AM

మహిళలతో కిమ్‌ ఉన్‌ హత్య చేయించాడా? - Sakshi

సియోల్‌(దక్షిణకొరియా): ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోన్‌ ఉన్‌ సవతి సోదరుడు కిమ్‌ జోంగ్‌ నామ్‌(45) హత్యను మహిళలే చేసినట్లు తెలిసింది. ఈ హత్యకు పాల్పడిన ఇద్దరు మహిళల్లో ఒకరిని ఇది వరకే అరెస్టు చేయగా మరో మహిళను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. జోంగ్‌ నాం శవానికి పోస్ట్‌మార్టం పూర్తయిందని, అయితే, ఆ వివరాలు బహిర్గంత చేయకూడదని మలేషియా పోలీసులు తెలిపారు.

దీనిపై మలేషియా రాయల్‌ పోలీసు బాస్‌ శ్రీ ఖలిద్‌ బిన్‌ అబు బకర్‌ మాట్లాడుతూ గురువారం ఉదయం జోంగ్‌ నామ్‌ను హత్య చేసిన మహిళను తాము అరెస్టు చేసినట్లు వివరించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అరెస్టు చేశామని, ఆమె వద్ద ఇండో నేషియా పాస్‌పోర్టు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే కిమ్‌ జోంగ్‌ చామ్‌ పేరిట ప్రయాణిస్తున్న ఆ వ్యక్తి జోంగ్‌ నామ్‌ అనే ఇప్పటి వరకు మలేషియా ప్రభుత్వం అధికారికంగా స్పష్టం చేయలేదు. ఉత్తర కొరియా మాత్రం ఆయనే అని ధ్రువీకరిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ హత్య వెనుకాల ఉత్తర కొరియా హస్తం ఉన్నట్లు పెద్ద మొత్తంలో అనుమానాలు వస్తున్నాయి.

అయితే, దీనిపై కూడా ఎలాంటి స్పష్టత లేదు. మరోపక్క, ఉత్తర కొరియా గురువారం ప్రస్తుతం చనిపోయిన కిమ్‌ జోంగ్‌ నామ్‌ తండ్రి కిమ్‌ జాంగ్‌ ఇల్‌ 75వ జయంతి వేడుకలు జరిపేందుకు సిద్ధమైంది. దేశంలో నియంతృత్వ పోకడలను నిరసించిన కిమ్‌ జోంగ్‌ నామ్‌ అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. లాయర్‌ అయిన కిమ్‌ జోంగ్‌నామ్‌ను తన తండ్రి కిమ్‌ జోంగ్‌-2 హయాంలో రాజకీయ వారసుడిగా పరిగణించేవారు. ఆయన మరణానంతరం సోదరుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పాలన పగ్గాలు చేపట్టారు. దీంతో ఎప్పటికైనా తనకు అడ్డు కారణంగానే అతడి మహిళతో ఈ హత్య చేసి ఉంటాడేమో అని కూడా చాలామంది అనుమానిస్తున్నారు.

Advertisement
Advertisement