అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చెలరేగింది. ఒక ఇంట్లో ఇస్తున్న పార్టీలో ఇద్దరు వ్యక్తులు చొరబడి విచ్చలవిడిగా కాల్చడంతో 13 మంది గాయపడ్డారు. పార్టీకి వెళ్తున్న సుమారు 100 మందిపై ఇద్దరు షూటర్లు వెనకనుంచి కాల్పులు జరిపినట్లు బ్రిడ్జిపోర్టు పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పార్టీకి జనం బాగా ఎక్కువగా రావడంతో.. కొంతమంది ఈ తుపాకి కాల్పులను టపాసుల కాల్పులు అనుకున్నారు.
పోలీసులు ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ పెంచి.. ప్రత్యక్ష సాక్షులు, బాధితుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. కాల్పులకు కారణం ఏంటో మాత్రం ఇంతవరకు తెలియలేదు. పార్టీకి వచ్చినవాళ్లలోనే ఎవరైనా కాల్పులు జరిపారా అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. నిందితులను వీలైనంత త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసు చీఫ్ అర్మాండో జె పెరెజె తెలిపారు. క్షతగాత్రులలో ఐదుగురు తప్ప మిగిలిన అందరికీ ప్రాథమిక చికిత్స చేసి పంపేశారు.
చాలామందికి కాళ్లలోనే గాయాలయ్యాయి. ఒక్కమహిళకు మాత్రం ముఖంమీద, దవడ మీద బుల్లెట్ గాయాలు కావడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. బాధితులంతా 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసువారేనని పోలీసులు తెలిపారు. అసలు పార్టీ ఎవరిచ్చారన్న విషయం కూడా ఇంకా తెలియలేదు. పార్టీలో మద్యం అమ్మేందుకు అనుమతి కోరినా.. అందుకు అనుమతి ఇవ్వలేదు. అయినా కూడా అక్కడ మద్యం అమ్మారని, అందుకు వారిపై క్రిమినల్ కేసులు పెడతామని అంటున్నారు.
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం
Published Mon, Aug 22 2016 9:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్ కోసం ఉగాండ జట్టు ప్రకటన.. 43 ఏళ్ల స్పిన్నర్కు చోటు
No Headline
No Headline
No Headline
No Headline
మద్యం అక్రమ రవాణా అడ్డుకట్టకు సహకరించండి
తక్కెళ్లపాడులో దారుణహత్య
కోల్డ్స్టోరేజ్ల సమస్యల పరిష్కారానికి కృషి
టీడీపీ నేత పెమ్మసానికి నోటి దురుసు ఎక్కువ
అణగారిన వర్గాలకు రాజ్యాధికారం వైఎస్ జగన్తోనే సాధ్యం
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement