సిన్సినాటీ నైట్ క్లబ్లో కాల్పులు
⇒ ఒకరు మృతి.. మరో 15 మందికి గాయాలు
⇒ లాస్వేగాస్లో బస్సులో కాల్పులు.. ఒకరి మృతి
సిన్సినాటీ(అమెరికా): అమెరికాలో తుపాకీ సంస్కృతి మరోసారి విజృంభించింది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడటంతో ఇద్దరు మరణించగా.. మరో 16 మంది గాయాలపాలయ్యారు. సిన్సినాటీ లోని కేమియో నైట్ క్లబ్లో ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటల సమయం లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వీకెండ్ కావడంతో కిక్కిరిసిన నైట్క్లబ్లో ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ఒకరు మరణించగా.. 15 మంది గాయపడ్డారు.
ఈ ఘటన వెనుక ఉగ్రవాద సంబంధాలు లేవని అసిస్టెంట్ పోలీస్ చీఫ్ పాల్ న్యూడిగేట్ చెప్పారు. కాల్పులకు గల కారణాలు తెలియలేదని, దీనిపై దర్యాప్తు జరుపుతున్నా మన్నారు. ఈ ఘటనకు సంబంధించి నింది తులెవరినీ పోలీసులు అరెస్ట్ చేయలేదన్నారు. కాల్పులకు పాల్పడింది ఒకే దుండగుడని సమాచారం అందిందని, ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా అనే దానిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. కాల్పుల్లో మరణించిన వ్యక్తి ఎవరనేది గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. నైట్ క్లబ్లో సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తామని పోలీసులు చెపుతున్నారు.
బస్సులో ఘాతుకం..
అమెరికాలో టూరిస్ట్ స్పాట్ లాస్వేగాస్లో మరో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓ దుండగుడు తుపాకీతో బస్సులోకి ప్రవేశించి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరు గాయపడ్డారు. అనంతరం దుండగుడు పోలీసులకు లొంగిపోయాడు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో కాస్మోపాలిటన్ హోటల్ క్యాసినో సమీపంలో డబుల్ డెక్కర్ బస్సులోకి ప్రవేశించిన దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. హైడ్రామా నడిచిన తర్వాత సుమారు 3.30 గంటల సమయంలో దుండగుడు తన వద్ద ఉన్న హ్యాండ్ గన్తో పాటు లొంగిపోయాడని లాస్వెగాస్ పోలీస్ అధికారి ల్యారీ హాడ్ఫిల్డ్ చెప్పారు. ఒకే వ్యక్తి ఉండటంతో దీనికి ఉగ్రవాద సంబంధాలు ఉండే అవకాశాలు లేవని చెప్పారు.
అమెరికాలో కాల్పుల కలకలం..
Published Mon, Mar 27 2017 2:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement