హిందూ మహాసముద్రంలో ‘విమాన శకలాలు’
గుర్తించిన ఫ్రాన్స్ శాటిలైట్లు
16 రోజులవుతున్నా ఆచూకీ లేని మలేసియా విమానం
కౌలాలంపూర్: గల్లంతైన మలేసియా విమానం ఆచూకీపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది. తాజాగా దక్షిణ హిందూమహాసముద్రంలో ఈ విమానానివిగా భావిస్తున్న శకలాలను ఫ్రాన్స్ ఉపగ్రహాలు గుర్తించాయి. వాటికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను ఫ్రాన్స్ ఆదివారం మలేసియాకు అందజేసింది. ఇవి ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి 2,300 కి.మీ దూరంలో తేలాడాయని, ఆ ప్రాంతంపై ఉపగ్రహాల నిఘా పరిధిని పెంచుతామని తెలిపింది. ఈ శకలాలను ఇటీవల చైనా, ఆస్ట్రేలియా శాటిలైట్ చిత్రాల్లో కనిపించిన విమాన శకలాలుగా భావిస్తున్న వస్తువులున్న చోటికి ఉత్తరంగా 930 కి.మీ దూరంలో శుక్రవారం గుర్తించినట్లు మలేసియా అధికారి ఒకరు చెప్పారు. మరోపక్క.. దక్షిణ హిందూ మహాసముద్రంలో కార్గో చెక్క పలకను(ప్యాలెట్) గుర్తించినట్లు ఆస్ట్రేలియా అధికారులు చెప్పారు. ఈ పలకతోపాటు దాని చుట్టుపక్కల సీట్లకు తగిలించుకునే రంగురంగుల బెల్టులు, ఇతర వస్తువులను తమ విమానం గుర్తించిందని, అయితే వాటి కోసం అక్కడికి వెళ్లిన న్యూజిలాండ్ విమానం ఏమీ కనుక్కోకుండానే తిరిగి వచ్చిందని చెప్పారు. విమానాల కింది భాగంలో ప్యాలెట్లను తరలిస్తుంటారని, అయితే షిప్పింగ్ పరిశ్రమలోనూ వాటిని వాడుతారు కనుక అప్పుడే ధ్రువీకరణకు రాకూడదని అన్నారు. ఈ వస్తువుల గుర్తింపుతో 16 రోజుల కిందట కనిపించకుండా పోయిన విమానం ఆచూకీ దొరుకుతుందేమోనని ఆశలు చిగురిస్తున్నాయి. గల్లంతైన విమానం కోసం ఆదివారం కూడా భారత్ సహా పలు దేశాలకు చెందిన నిఘా విమానాలు, నౌకలు గాలించినా ఫలితం లేకపోయింది.
‘ఏప్రిల్ 6 నాటికి ఆ ధ్వనులు ఆగిపోవచ్చు’
వాషింగ్టన్: మలేసియా విమానాన్ని కనుక్కోవడంలో విఫలమైతే అందులోని రెండు బ్లాక్స్బాక్సుల నుంచి పింగర్స్ విడుదల(తక్కువ నిడివి గల ధ్వనులు) ఏప్రిల్ 6 నాటికల్లా ఆగిపోయే అవకాశముందని వైమానిక నిపుణుడొకరు చెప్పారు. విమానంలోని బ్లాక్బాక్సుల బ్యాటరీల జీవితకాలం సగం ముగిసిందని మార్గనిర్దేశక పరికరాల తయారీ సంస్థ డుకేన్ సీకామ్ అధిపతి అనీశ్ పటేల్ తెలిపారు. ఏప్రిల్ 6 తర్వాత బోయింగ్ కాక్పిట్ వాయిస్ రికార్డులను కనుగొనడం కష్టమవుతుందని అన్నారు.
విమానం ఆచూకీపై మరిన్ని ఆధారాలు!
Published Mon, Mar 24 2014 1:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
క్లుప్తంగా
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement