మలేషియాలో భారీ భూకంపం | Sakshi
Sakshi News home page

మలేషియాలో భారీ భూకంపం

Published Fri, Jun 5 2015 7:52 AM

మలేషియాలో భారీ భూకంపం

కౌలాలంపూర్: ఆగ్నేయ ఆసియాలోని మలేషియాలో శుక్రవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. బోర్నో ద్వీపంలో భూతలానికి 10 కీలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గ నమోదయింది. మొదట భూకంపాన్ని యూఎస్ జియాలజికల్ సర్వే గుర్తించింది. అయితే దీనివల్ల ఏర్పడిన నష్టానికి సంబంధించి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, మలేషియా ప్రభుత్వం సునామి హెచ్చరికలు జారీచేయలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement