శనివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2024
– 2లోuజిల్లా కోర్టు జడ్జి పూజలు
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని ములుగు, భూపాలపల్లి జిల్లా కోర్టు ఇన్చార్జ్ జడ్జి ఎస్వీపీ సూర్యచంద్రకళ దర్శించుకున్నారు. శుక్రవారం ఆమె ఆలయ రాజగోపురం వద్దకు రాగా అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి వారి గర్భగుడిలో ప్రత్యేక అభిషేకం, శ్రీశుభానందదేవి అమ్మవారిని ఆలయంలో దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆశీర్వచన వేదిక వద్ద అర్చకులు స్వామివారి శేష వస్త్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం ఎస్సై భవానిసేన్, ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
అన్నారం బ్యారేజీ
వంతెన వద్ద తనిఖీలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలంలోని అన్నారం బ్యారేజీ వంతెన వద్ద ఎస్సై భవానిసేన్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. శుక్రవారం రెండు జిల్లాలకు వచ్చిపోయే వాహనాలను నిలిపి సరైన కాగితాలు లేనివారి వివరాలు సేకరించారు. అనుమానితులను విచారించి వదిలేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం, ఇతర మత్తు పదార్థాలు, ఆయుధాలు తరలిపోకుండా కట్టడి చేస్తున్నారు. ఆయన వెంట సివిల్, సీఆర్పీఎఫ్ పోలీసులు ఉన్నారు.
కీర్తిబాయి కుటుంబానికి
అండగా ఉంటాం
మహాముత్తారం: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు కీర్తిబాయి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కీర్తిబాయి అంత్యక్రియలు శుక్రవారం బోర్లగూడెం గ్రామంలో నిర్వహించారు. అంత్యక్రియల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీతో కలిసి మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. కీర్తిబాయి మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. మంత్రివెంట డీసీసీ అధ్యక్షుడు ఐత ప్రకాశ్రెడ్డి, నాయకులు ఉన్నారు.
చంద్రబోస్
జన్మదిన వేడుకలు
చిట్యాల: ఆస్కార్ అవార్డు గ్రహీత, సినీ గేయ రచయిత చంద్రబోస్ జన్మదిన వేడుకలను చేయూత స్వచ్చంధ సేవా సంస్థ చైర్మన్ మ్యాదరి సునీల్ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ అఖిల రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. సువిద్య డిగ్రీ కాలేజీలో కేక్ కట్ చేసి సమావేశం నిర్వహించారు.. అనంతరం కవులకు, కళాకారులకు, క్రీడారంగంతో పాటు, వైద్య, సామాజిక సేవా రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలతో పాటు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి జెట్టి శంకర్, సినీ గేయ రచయిత బండి సత్యం, వర్ధమాన గేయ రచయిత దాసారపు నరేష్, బానోత్ రాజునాయక్, రత్నాకర్, గడ్డం రజిత, జన్నే యుగేందర్, దబ్బెట అనిల్, మాసు రమేష్, రాథోడ్, శ్రీదేవి, రాజ్కుమార్, గుర్రపు రాజమౌళి, పాల్గొన్నారు.
దాడి అమానుషం
మంగపేట: ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన అటవీశాఖ రేంజ్ పరిధిలోని తుంగేడులో పోడు వ్యవసాయాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ములుగు యూనిట్ జూనియర్ అటవీశాఖ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, సెక్రటరీ కోటేశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అటవీశాఖ అధికారులపై ఇలాంటి దాడులు చేయడం అమానుష చర్య అన్నారు. నేటితో
ముగియనున్న ‘పార్లమెంట్’
ప్రచారం
సాక్షిప్రతినిధి, వరంగల్:
లోక్సభ ఎన్నికల ఘట్టం క్లైమాక్స్కు చేరింది. శనివారం ఎన్నికల ప్రచారానికి తెరపడనుండగా.. ఆఖరు రోజు ప్రచారాన్ని హోరెత్తించేందుకు ప్రధాన పార్టీలు షెడ్యూల్ ఖరారు చేసుకున్నాయి. ప్రచారం ముగిసిన వెంటనే కీలక భేటీలు నిర్వహించనున్నాయి. వరంగల్ లోక్సభ పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇన్నాళ్లు సాగించిన ప్రచారాలు, రోడ్షోలు, సమావేశాలు ఒకెత్తు.. ఇక మీదట కొన్ని గంటల్లో చూపించే ప్రభావం మరో ఎత్తు అనేలా ఎన్నికల వాతావరణాన్ని మార్చేస్తున్నారు. ఇప్పటివరకు చేపట్టిన ప్రచారంలో లోటుపాట్లను గుర్తు చేసుకుంటూనే పునఃపరిశీలనలతో ఎక్కడ ఎన్ని ఓట్లను పొందవచ్చనే విషయమై మల్లగుల్లాలు ప డుతున్నారు. ఇదే సమయంలో ఆఖరు రోజు శని వారం ప్రచారం మరింత హోరెత్తించేందుకు శుక్రవా రం రాత్రే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కేడర్కు బాధ్యతలు ఇచ్చి ప్రణాళికలు ఖరారు చేసుకున్నాయి.
ఎవరి ప్రయత్నాలు వారివి..
గెలుపుపై అందరి ధీమా..
లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లు వ్యూహాలకు పదునుపెట్టాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రచార గడువు ముగియనుండడంతో రెండు రోజులనుంచే ప్రచారం ముమ్మరం చేశారు. ఆయా పార్టీల్లోని మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు, అభ్యర్థులు శ్రేణులకు తగిన సలహాలు, సూచనలు చేస్తున్నారు. అరూరి రమేశ్ (బీజేపీ), కడియం కావ్య (కాంగ్రెస్), డాక్టర్ మారేపల్లి సుధీర్కుమార్ (బీఆర్ఎస్)లను గెలుపు శిఖరాలకు చేర్చేందుకు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈనేపథ్యంలో మూడు పార్టీల అభ్యర్థులు ఎవరికివారుగా ఇప్పటికే గెలుపు ఽధీమాను వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ముక్కోణపు పోటీపై రాష్ట్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. దీంతో అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్ గెలుపు కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు పుష్కర్ సింగ్ దామి, భజన్లాల్ శర్మ, కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు ప్రచారం చేశారు. ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య తరఫున ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాలుగు భారీ సభలు, కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఏడు సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలు, వారి అనుచరులు కావ్య గెలుపు కోసం శ్రమిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్న గులాబీ శ్రేణులు విస్తృతంగా పర్యటిస్తున్నాయి. గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బస్వరాజు సారయ్య, బండా ప్రకాశ్, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్లు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఏదేమైనా నేటితో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి తెరపడనుండగా.. గెలుపు ఓటములపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జోరుగా బెట్టింగ్లు కూడా జరుగుతుండడం ఆసక్తికరంగా మారింది.
పోస్టల్ బ్యాలెట్
89.03శాతం పోలింగ్
భూపాలపల్లి అర్బన్: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ 89.03శాతం పోలింగ్ అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్మిశ్రా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే 2,245 మంది సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ జారీచేయగా 2,013 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. చివరి రోజున 64మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించారని, ఈ ప్రక్రియలో విధులు నిర్వహించిన అధికారులను, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. న్యూస్రీల్ గెలుపే లక్ష్యంగా పార్టీల పావులు.. వ్యూహాలకు పదును
పోటాపోటీగా బీజేపీ, కాంగ్రెస్,
బీఆర్ఎస్ల ప్రచారం
ఎవరికి వారుగా గెలుపు
ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు
వరంగల్ స్థానంపై ఉత్కంఠ..
జోరుగా సాగుతున్న బెట్టింగులు ప్రచారానికి నేటితో తెర... ఇక తాయిలాల ఎర..
లోక్సభ పరిధిలో ఇప్పటివరకు హోరెత్తించిన తీరుకు భిన్నంగా నోట్లతో ఓట్లను ప్రసన్నం చేసుకునే ఎత్తుగడలు శనివారం సాయంత్రం నుంచి అమల్లోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గంపగుత్తగా ఓట్లను కొనడం సహా ప్రభావాన్ని చూపే నాయకుడి చేతి వరకు తాయిలాల వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా నడిపించేలా ప్రధాన పార్టీల నేతలు సన్నాహాలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎన్నికల సంఘం నిఘా పెరగడంతో చాటుమాటుగా ఈ వ్యవహారాన్ని నడిపించేలా కొందరికే బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు. సుమారు 10 లక్షల మంది ఓటర్లకు రూ.200ల నుంచి రూ.500ల వరకు డబ్బులు పంపిణీ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీటిని అరికట్టేందుకు ఎన్నికల సంఘం, ప్రత్యేక పోలీసు బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి.