ఉగ్రవాదుల దొంగదెబ్బకు అమెరికన్ బలి | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదుల దొంగదెబ్బకు అమెరికన్ బలి

Published Mon, Jun 6 2016 12:53 PM

Taliban ambush kills American photojournalist and translator in Afghanistan

న్యూయార్క్: మరోసారి ఉగ్రవాదులు దొంగ దెబ్బతీశారు. ఇద్దరు అమెరికాకు చెందిన అఫ్ఘన్ ఉద్యోగులను దొంగచాటుగా రాకెట్ లాంచర్ తో చంపేశారు.  మృతుల్లో ఒకరు అమెరికా చెందిన ప్రముఖ అమెరికా ఫొటో గ్రాఫర్ డేవిడ్ గిల్కీ(50) కాగా, మరోకరుఅప్ఘన్ అనువాదకుడు జబిహుల్లా తమన్నా(38)  అఫ్ఘనిస్థాన్లో నేషనల్ పబ్లిక్ రేడియోలో పని చేస్తున్నారు.

ఓ అసైన్ మెంట్కు సంబంధించి అఫ్ఘన్ ఆర్మీతో కలిసి జీపులో వెళుతుండగా ఉగ్రవాదులు 82ఎంఎం రాకెట్ను వారి వాహనంపై ప్రయోగించారు. దీంతో ఓ ఆర్మీ అధికారి సహా వీరిద్దరు ప్రాణాలుకోల్పోయారు. సరిగ్గా ఆదివారం మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు అధికారులు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement