ఓ సెల్ఫీ.. బాంబుతో చంపించింది | Sakshi
Sakshi News home page

ఓ సెల్ఫీ.. బాంబుతో చంపించింది

Published Sat, Jun 6 2015 5:15 PM

ఓ సెల్ఫీ.. బాంబుతో చంపించింది - Sakshi

న్యూయార్క్: సెల్ఫీలు అందరికీ సురక్షితంగా కాదు. ముఖ్యంగా నేరస్తులకు, ఉగ్రవాదులకు. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాది ఒకడు సిరియాలోని తమ సంస్థ ప్రధాన కార్యాలయం ముందు నిల్చుని సెల్ఫీ తీసుకున్నాడు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

అమెరికా దళాలు ఈ సెల్ఫీ ఆధారంగా ఐఎస్ఐఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. సెల్ఫీని స్కాన్ చేసి ఉగ్రవాద స్థావరాన్ని కనుగొన్నారు. అమెరికా వైమానిక దళాలు ఐఎస్ఐఎస్ కార్యాలయంపై బాంబు దాడులు చేశాయి. సోషల్ మీడియాలో ఈ సెల్ఫీని పోస్ట్ చేసిన 22 గంటల్లోనే ఆ ప్రాంతాన్ని గుర్తించి..  ఐఎస్ఐఎస్ కార్యాలయాన్ని మొత్తం పేల్చివేశారు. ఇందులో ఉన్న ఉగ్రవాదులందరూ హతమయ్యారు.

Advertisement
Advertisement