ఫస్ట్‌ యాక్సిడెంట్‌.. | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ యాక్సిడెంట్‌..

Published Thu, Feb 2 2017 4:12 AM

ఫస్ట్‌ యాక్సిడెంట్‌.. - Sakshi

ప్రపంచంలో తొలిసారి రైలు చక్రాల కింద నలిగిపోయిన అభాగ్యుడెవరో తెలుసా? ఈయనే. పేరు విలియం హస్కిసన్, బ్రిటన్‌ ఎంపీ. 1830 సెప్టెంబర్‌ 15న బ్రిటన్‌లోని లివర్‌పూల్, మాంచెస్టర్‌ రైల్వేలైన్‌ను ప్రారంభించేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ రైలు కింద పడి మరణించారు.

ఇదే కార్యక్రమానికి వచ్చిన డ్యూక్‌ ఆఫ్‌ వెల్లింగ్టన్‌ ఆర్థర్‌ వెలస్లీతో మాట్లాడేందుకు పక్కనే ఉన్న పట్టాలపై నడుచుకుంటూ ముందుకు వెళ్లారు. అయితే అదే సమయంలో ఆ పట్టాలపై మరో రైలు వస్తోంది. రైలు దగ్గరికి రాగానే తడబడుతూ పట్టాలపై పడిపోయారు. అందరూ చూస్తుండగానే ఘోరం జరిగిపోయింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement