ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారంగా ముగ్గురి కాల్చివేత | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారంగా ముగ్గురి కాల్చివేత

Published Wed, Jun 3 2015 11:45 AM

Three killed in poll violence in Pakistan

ఎన్నికల్లో ఓటమిపాలైన ఓ నాయకుడు సహనం కోల్పోయి ప్రత్యర్థి పార్టీకి చెందిన కార్యకర్తలను కాల్చిచంపిన ఘటన పాకిస్థాన్ లోని ఖైబర్ ప్రావిన్స్లో సంచనం రేపింది.

పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వం వహిస్తోన్న పాకిస్థాన్ ముస్లీమ్ లీగ్ (పీఎంఎల్) పార్టీకి చెందిన నాయకుడు ఒకరు పాకిస్థాన్ తెహ్రీక్- ఏ- ఇన్సాఫ్ కార్యకర్తలపై కాల్పులు జరిపారని, ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు చెప్పారు. ఈ హత్యలతో ఖైబర్ ప్రావిన్స్  ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసలో మరణించినవారి సంఖ్య 21కి పెరిగింది.

Advertisement
Advertisement