పోలీసుల కాల్పుల్లో.. ముగ్గురు ఖైదీల మృతి | Sakshi
Sakshi News home page

పోలీసుల కాల్పుల్లో.. ముగ్గురు ఖైదీల మృతి

Published Sun, Jul 16 2017 5:17 PM

Three killed, one injured in prison breakout in restive Jolo

మనీల(ఫిలిప్పైన్స్‌):
ఫిలిప్పైన్స్‌లోని రెస్టివ్ జోలో ఐలాండ్‌లో ఓ జైలు నుంచి 14 మంది ఖైదీలు పరారయ్యేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఖైదీలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. పట్టుకునే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా..ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఫిలిప్పైన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టి ఐలాండ్‌ను సందర్శించిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. గత జనవరిలో బంగసామోరో ఇస్లామిక్‌ ఫ్రీడం ఫైటర్స్‌ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన 160 మంది మిందానౌ ఐలాండ్‌లోని జైలు నుంచి పరారైన సంగతి తెల్సిందే.

Advertisement
Advertisement