కిడ్నాప్ చేసి మగవాడిపై అత్యాచారం | Sakshi
Sakshi News home page

కిడ్నాప్ చేసి మగవాడిపై అత్యాచారం

Published Sat, Dec 26 2015 2:57 PM

కిడ్నాప్ చేసి మగవాడిపై అత్యాచారం - Sakshi

కేప్టౌన్: దక్షిణాఫ్రికాలో వింత, దారుణమైన సంఘటన జరిగింది. ముగ్గురు మహిళలు ఓ మగవాడిని కిడ్నాప్ చేసి అతడిపై అత్యాచారం చేశారు. అతడి నుంచి వీర్యం సేకరించి ప్లాస్టిక్ బ్యాగుల్లో తీసుకెళ్లారు. పోలీసులు ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల పోర్ట్ ఎలిజబెత్లోని క్వజకెలె టౌన్ షిప్లో ముగ్గురు మహిళలు తుపాకీతో ఓ వ్యక్తి (33) ని బెదిరించి బీఎండబ్ల్యూ కారులో దాదాపు 500 కిలో మీటర్ల దూరం తీసుకెళ్లారు. బాధితుడితో ఉత్ప్రేరక ద్రవాన్ని తాగించి లైంగిక దాడికి పాల్పడి, వీర్యం సేకరించారు. అనంతరం కారులోంచి అతడిని తోసివేసి పరారయ్యారు. బాధితుడు భయంతో వణికిపోయాడని, ఇలాంటి సంఘటనను ఎప్పుడూ వినలేదని, కేసు గందరగోళంగా ఉందని ఓ పోలీస్ కానిస్టేబుల్ చెప్పారు. కాగా బాధితుడు స్పృహలో ఉన్నాడని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement