20 మంది ఉగ్రవాదుల హతం | Sakshi
Sakshi News home page

20 మంది ఉగ్రవాదుల హతం

Published Fri, Jun 19 2015 5:51 PM

Twenty terrorists killed in Pakistan

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. శుక్రవారం ఇరవై మంది ఉగ్రవాదులను పాకిస్తాన్ ఆర్మీ మట్టుబెట్టింది. దీనిలో భాగంగా ఈ రోజు  పలు గిరిజన ప్రాంతాల్లోని మిలిటెంట్ల స్థావరాలపై పాకిస్తాన్ ఆర్మీ ఒక్కసారిగా వైమానిక దాడులు చేసింది.  ఈ క్రమంలోనే ఒక్క కైబర్ ఏజెన్సీలో 18 మంది ఉగ్రవాదులను ఆర్మీ దళాలు హతమార్చాయి.

 

గత సంవత్సరం డిసెంబర్ నెలలో 140 మంది అమాయక ప్రజల్ని మిలిటెంట్లు హతమార్చిన సంగతి తెలిసిందే.  ఆర్మీ స్కూల్ పై దాడులకు పాల్పడిన ఘటనలో అధికశాతం మంది విద్యార్థులను మిలిటెంట్లు పొట్టనపెట్టుకున్నారు. అనంతరం దేశంలో ఉగ్రవాదుల ఆగడాలు శృతిమించడంతో పాకిస్తాన్ కైబర్-2 ఆపరేషన్ కు శ్రీకారం చుట్టింది.

Advertisement
Advertisement