వాషింగ్టన్: ఉత్తర కొరియా, అమెరికా మధ్య యుద్ధం అనివార్యం కానుందా? తొలుత తమ యుద్ధ నౌకను ఉత్తర కొరియా సముద్ర జలాలకు దగ్గర్లో దించి బెదిరించినా లెక్కచేయకపోవడంతో అమెరికా ఆ దేశానికి తన సత్తా చూపించాలని అనుకుంటుందా? ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తోంది. మొన్నటి మొన్న ఓ యుద్ధ నౌకను ఉత్తర కొరియావైపు తీసుకెళ్లిన అమెరికా తాజాగా మరో యుద్ధ నౌకను బయటకు తీసింది. అత్యంత కీలకంగా పనిచేసే యూఎస్ఎస్ రోనాల్డ్ రీగన్ను కూడా అటువైపే పంపిస్తోంది.
ఇప్పటికే అక్కడ ఉన్న యూఎస్ఎస్ కార్ల్ విన్సన్, రోనాల్డ్ కలిసి యుద్ధ విన్యాసాలు చేయనున్నట్లు అమెరికా రక్షణశాఖ అధికారులు చెప్పారు. గత ఏప్రిల్ 5న, ఇటీవల ఉత్తర కొరియా మరోసారి తన బాలిస్టిక్ అణుక్షిపణిని పరీక్షించడం, అమెరికాపై దాడి చేస్తామంటూ రెచ్చగొట్టేలా మాట్లాడటం వంటి పరిణామాల దృష్ట్యా ఇప్పుడు ఉత్తర కొరియా వైపు యుద్ధ నౌకలు రావడం మరింత ఆందోళనను కలిగిస్తోంది. జపాన్లోని యోకోసుకాలోని హోమ్పోర్ట్లో సముద్ర తీర పర్యవేక్షణ బాధ్యతలు తాము చేసుకున్న ఒప్పందం మేర ముగిసన నేపథ్యంలో ఇప్పుడు రోనాల్డ్ రీగర్ కూడా ఉత్తర కొరియా వైపు పంపించారు. దీనితోపాటు రెండు మరో భారీ నౌకలు కూడా వెళుతున్నాయి. ‘చాలాకాలంగా నిర్వహిస్తున్న బాధ్యతలు ముగిసిన నేపథ్యంలో రోనాల్డ్ రీగన్, ఇతర దాడులకు సంబంధించిన గ్రూపులను అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాం. అందులో భాగంగా ప్రస్తుతం కొరియా ద్వీపకల్పం వైపు తీసుకెళుతున్నాం’ అని చార్లెస్ విలియమ్స్ అనే అధికారి చెప్పారు.
ఈ యుద్ధనౌక అక్కడికి చేరుకోగానే శిక్షణ సంబంధమైన విన్యాసాలను కార్ల్ విన్సన్తో కలిసి నిర్వహిస్తుందని తెలిపారు. యుద్ధ విమానాన్ని విజయవంతంగా ప్రయోగించడంతోపాటు తిరిగి దానిని సురక్షితంగా దించడం అనే అంశం ప్రధానంగా ఈ విన్యాసాలు ఉంటాయని చెప్పారు. వాస్తవానికి కార్ల్ విన్సన్ను తొలుత ఉత్తర కొరియా వైపు పంపించిన అమెరికా సరిగ్గా దానికి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో విన్యాసాలు పంపించినట్లు తెలిసిందే. అయితే, తాజాగా తమ యుద్ధ నౌక ఆస్ట్రేలియాకు వెళ్లలేదని, రోనాల్డ్తో కలిసి పనిచేసేందుకు ఉత్తర కొరియా సమీపంలోనే సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
ఉత్తర కొరియావైపు రెండో అమెరికా యుద్ధనౌక
Published Fri, May 19 2017 9:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లారీని ఢీకొన్న ట్రావెల్ బస్సు
బాస్కెట్బాల్ జాతీయ పోటీలకు ఏలూరు క్రీడాకారులు
టీడీపీ చింతలపూడి అభ్యర్థి సొంగాను ప్రాసిక్యూట్ చేయాలి
జగనన్న గెలుపులో భాగస్వాములవుదాం
లారీ ఢీకొని ఆటో డ్రైవర్ మృతి
ప్రశాంతంగా నీట్ పరీక్ష
వైఎస్సార్సీపీలోకివలసలవరద
రాట్నాలమ్మకు ప్రత్యేక పూజలు
కాకర్ల విజయం క్లిష్టమే..!
నోటుతో ఓటుకు ఎర
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement