కొత్త విధాన నిర్ణయాలు తీసుకోనున్న అమెరికా
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా తెలివైనోళ్లందరినీ తన దగ్గరకు తెచ్చుకుని పని చేయించుకోవాలనుకునే అమెరికా.. ఆ దిశగా మరో ప్రయత్నం చేస్తోంది. హెచ్-1బీ వీసా కలిగిన సాంకేతిక నిపుణుల జీవిత భాగస్వాములు కూడా అమెరికాలో ఉద్యోగం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని భావిస్తోంది. తద్వారా ఇతర దేశాల్లో ఉన్న నిపుణులను తమ దేశంవైపు ఆకర్షించాలని చూస్తోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ మేరకు త్వరలో పలు విధాన నిర్ణయాలు తీసుకోనున్నారు. ‘అమెరికాలో ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు, ఉద్యోగాల కల్పనకు, సృజనాత్మక పోటీతత్వాన్ని పెంచడానికి వీలుగా ప్రతిభ కలిగిన విదేశీ పారిశ్రామికవేత్తలు, ఇతర ఉత్తమ నైపుణ్యాలు కలిగిన ఇమిగ్రంట్లను మరింతగా ఆకర్షించాలనుకుంటున్నాం.
ఇందుకుగాను హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం త్వరలో కొన్ని నిబంధనలను వెల్లడించనుంది’ అని అమెరికా అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో తెలిపింది. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల జీవిత భాగస్వాములకు అమెరికాలో ఉద్యోగం చేసుకోవడానికి అనుమతిచ్చే నిబంధనలు కూడా ఇందులో ఉన్నాయని పేర్కొంది. వీరితోపాటు ప్రతిభ కలిగిన ప్రొఫెసర్లు, పరిశోధకులకు కూడా ఉపాధి అవకాశాలు పెంచాలని చూస్తున్నట్లు వెల్లడించింది. అయితే హెచ్-1బీ వీసా ఉన్న వారందరి జీవిత భాగస్వాములకూ ఉద్యోగ అవకాశం రాకపోవచ్చు. ప్రధానంగా శాస్త్ర-సాంకేతిక రంగాల్లో వారికే ఇది లాభించే అవకాశముందని తెలుస్తోంది.
హెచ్1బీ వీసా ఉంటే.. భార్యా జాబ్ చేయొచ్చు!
Published Wed, Apr 9 2014 2:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
Advertisement