ఇరాక్‌లో అమెరికా జర్నలిస్టును హతమార్చిన ఉగ్రవాదులు | Sakshi
Sakshi News home page

ఇరాక్‌లో అమెరికా జర్నలిస్టును హతమార్చిన ఉగ్రవాదులు

Published Thu, Aug 21 2014 1:42 AM

ఇరాక్‌లో అమెరికా జర్నలిస్టును హతమార్చిన ఉగ్రవాదులు

బాగ్దాద్: ఇరాక్‌పై అమెరికా దాడులకు నిరసనగా 2012లో సిరియాలో కిడ్నాప్ చేసిన అమెరికా జర్నలిస్టు జేమ్స్ ఫోలేను ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా హతమార్చారు. మంగళవారం అతని తల నరికి చంపి ఆ వీడియోను యూట్యూబ్‌లో పెట్టారు. ఇరాక్‌పై అమెరికా దాడులు కొనసాగిస్తే మరో అమెరికా జర్నలిస్టును హతమారుస్తామని హెచ్చరించారు.

ఉగ్రవాదుల దాష్టీకాన్ని అమెరికా, బ్రిటన్ తీవ్రంగా ఖండించాయి. జిమ్‌ను కిరాతకంగా హత్యచేయడం ప్రపంచాన్ని భయకంపితం చేసిందని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు. ఈ చర్యతో ఐఎస్‌ఐఎస్ మిలి టెంట్లు తమకు ఏ మతం లేదని చాటుకున్నారన్నారు

Advertisement
Advertisement