మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, 64 ఏళ్ల వయస్సులో కూడా బలిష్టంగా కనిపించడానికి కారణం రోజు వ్యాయామం చేయడం ఒక్కటే కారణం కాదట. ఆయన తరచుగా దుప్పి కొమ్ముల నుంచి తీసిన రక్తంలో స్నానం చేస్తారట. అలా చేయడం వల్ల శరీరంలోని ఎముకలు, కండరాలు, నడుము, కీళ్లు బలంగా తయారవడమే కాకుండా లైంగిక పటుత్వ శక్తి గణనీయంగా పెరుగుతుందట. దష్టి, వినికిడి శక్తి కూడా పెరుగుతుందట. అందుకే పుతిన్ తరచుగా రష్యాలోని అల్తాయ్ పర్వత ప్రాంతాలకు వెళతారట. ఇటీవల ఆయన అక్కడికి వెళ్లినప్పుడు అధికారులు 70 కిలోల దుప్పి కొమ్ములను విరిచి అందులో నుంచి రక్తం తీసి స్నానానికి సిద్ధం చేశారట. అందులో పుతిన్ తనువుతీర జలకాలాడారట. ఈ విషయాలను స్థానిక పత్రిక ‘రిపబ్లిక్’ వెల్లడించింది.
దుప్పి, ముఖ్యంగా మరల్ లేదా రెడ్ దుప్పి కొమ్ముల నుంచి తీసిన రక్తంలో స్నానం చేస్తే ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుందని, వయస్సు అంత తొందరగా మీద పడదనే నమ్మకం రష్యాలో ప్రాచీనమైనది. మనిషిలో లైంగిక పటుత్వాన్ని పెంచే ‘టెస్టోస్టెరేన్’ దుప్పి రక్తం వల్ల పెరిగుతుందని నమ్మి, వాటి రక్తంలో మునిగి స్నానం చేసే వారు ఇప్పటికీ రష్యాలో ఎంతో మంది ఉన్నారు. లైంగిక పటుత్వాన్ని పెంచే చైనా ఉత్పత్తుల్లో కూడా దుప్పి రక్తాన్ని ఎక్కువగా వాడుతుంటారు. నిమోనియా, ఆస్తమా, ఆస్టియోపొరోసిస్, ప్లూరిసీలాంటి జబ్బులకు, వెన్నుముక సమస్యలకు దుప్పి కర్తం బలేగా పనిచేస్తుందట.
వ్లాదిమీర్ పుతిన్ పదేళ్ల క్రితం తన మిత్రుడైన అప్పటి దేశ ప్రధాన మంత్రి దిమిత్రి మెద్వదెవ్ ద్వారా దుప్పి కొమ్ముల రక్తంలో ఉండే ఔషధ గుణాల గురించి మొదటిసారి తెలుసుకున్నారట. మెద్వదెవ్ కూడా దుప్పి రక్తంలో స్నానం చేస్తారని అప్పట్లో విస్తత ప్రచారం ఉండేది. దుప్పి రక్తం గొప్పతనం గురించి స్వయంగా తెలుసుకునేందుకు పుతిన్ మరల్ బ్లడ్ వైద్య నిపుణుడు అలెగ్జాండర్ జుకోవ్ను కలుసుకున్నారట. ఇటలీ మాజీ ప్రధాన మంత్రి సిల్వియో బెర్లూస్కీ 2015లో సైబీరియా పర్యటనకు వచ్చినప్పుడు ఆయన కూడా దుప్పి కొమ్ముల రక్త రహస్యం గురించి పుతిన్ చెప్పారట. బెర్లూస్కీ 70వ దశకంలో కూడా శంగార లీలలు నెరపిన వైనం ప్రపంచానికి తెల్సిందేకదా! పుతిన్పై స్థానిక పత్రికలో వచ్చిన ఈ కథనాన్ని చదివిన జంతు ప్రేమికులు మాత్రం ఆయనపై మండిపడుతున్నారు.
‘రక్తం’లో స్నానం చేసే పుతిన్
Published Thu, Jul 20 2017 4:36 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement