డోనెట్సెక్ ప్రావిన్స్ రెబెల్స్ ప్రకటన
ఉక్రెయిన్ విచ్ఛిన్నం అనివార్యం!
డోనెట్సెక్/మాస్కో:ఉక్రెయిన్లో అంతర్గత సంక్షోభం ముదిరిపోవటంతో మరో విచ్ఛిన్నం అనివార్యంగా మారింది. ఉక్రెయిన్ నుంచి విడిపోవాలని, స్వతంత్ర దేశంగా మారి రష్యాలో చేరాలని డోనెట్సెక్ ప్రావిన్స్ మెజారిటీ ఓటర్లు రిఫరెండం (ప్రజాభిప్రాయ సేకరణ)లో తీర్పు ఇచ్చారని.. రష్యా అనుకూల తిరుగుబాటుదార్లు ఏర్పాటు చేసిన ఎన్నికల కమిషన్ ప్రకటించింది. డోనెట్సెక్ పొరుగు రాష్ట్రమైన లుగాంస్క్లో కూడా ఇదే తరహా రిఫరెండం జరిగినప్పటికీ.. ఆ ఫలితాలను ప్రకటించలేదు. ఈ రిఫరెండం అక్రమమని, బూటకమని ఉక్రెయిన్ సహా అమెరికా, ఐరోపా దేశాలు మండిపడుతుండగా.. స్వీయపాలన కోసం రిఫరెండం ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని రష్యా ప్రకటించింది. అయితే రష్యాలో చేర్చుకోవాలన్న డోనెట్సెక్ ప్రకటనపై ఆ దేశం స్పందించలేదు.
ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని డోనెట్సెక్, లుగాంస్క్ ప్రావిన్స్లలో తిరుగుబాటుదార్లు స్వాతంత్య్రం కోసం ఆదివారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్లోని 4.6 కోట్ల మంది జనాభాలో ఈ రెండు ప్రావిన్స్లలో 70 లక్షల మంది (డోనెట్సెక్లో 44 లక్షలు, లుగాంస్క్లో 22 లక్షల మంది) ఉన్నారు. రష్యా అనుకూల తిరుగుబాటుదార్లు, ఉక్రెయిన్ సైనిక బలగాలకు మధ్య ఘర్షణలు జరుగుతున్న సమయంలో.. విదేశీ మీడియాకు అనుమతి ఇవ్వకుండా ఈ రిఫరెండాలు నిర్వహించారు. డోనెట్సెక్ రెఫరెండం ఫలితాలను తిరుగుబాటుదార్లు ఏర్పాటు చేసుకున్న ఎన్నికల కమిషన్ చీఫ్ రోమన్ల్యాగిన్ ఆదివారం రాత్రి పొద్దుపోయాక ప్రకటించారు. మొత్తం 75 శాతం మంది ఓటింగ్లో పాల్గొనగా అందులో 89 శాతం మంది స్వాతంత్య్రానికి అనుకూలంగా తీర్పునిచ్చారని.. 10 శాతం మంది మాత్రమే వ్యతిరేకించారని ఆయన డోనెట్సెక్లో విలేకరుల సమావేశంలో తెలిపారు. తాజా పరిణామాలతో ఉక్రెయిన్ విచ్ఛిన్నమవుతుందని.. యూరప్ తూర్పు కొసలో అంతర్యుద్ధం రాజుకుంటుందని పాశ్చాత్యదేశాలు ఆందోళన చెందుతున్నాయి.
ప్రజాభిప్రాయం స్వాతంత్య్రమే
Published Tue, May 13 2014 1:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement